December 4, 2023

Telugu

  • గ్రీన్ టీ మాత్రమే కాదు.. గ్రీన్ కాఫీని తాగినా బోలెడు లాభాలున్నాయి..
    on December 4, 2023 at 1:45 am

    గ్రీన్ టీని మనలో చాలా మంది తాగుతుంటారు. అయితే ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా తాగారా? దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా?    చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చాలా మంది కాఫీని తరచుగా తాగుతుంటారు. ఎలాంటి సీజన్ అయినా సరే.. కాఫీని మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.    అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజానికి గ్రీన్ టీ టేస్టీగా ఉండటమే కాదు. మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి గ్రీన్ కాఫీ గురించి తెలియదు. ఈ గ్రీన్ కాఫీ కూడా ఎంతో టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కెఫిన్ కంటెంట్ అసలే ఉండదు. అందుకే దీన్ని వీలైనంత వరకు తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..  యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం గ్రీన్ కాఫీ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఈ కాఫీలో పొటాషియం, సోడియంలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం గ్రీన్ కాఫీ డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఈ కాఫీని తాగడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే గ్రీన్ కాఫీని రోజూ తాగండి.    శరీరానికి శక్తి గ్రీన్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. మీకు అలసటగా అనిపిస్తే గ్రీన్ కాఫీని ఎంచక్కా తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీని తాగడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.      చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు  ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి కూడా గ్రీన్ కాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రీన్ కాఫీ బీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా గ్రీన్ కాఫీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మానికి మేలు  గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, రైడిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.   

  • Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు పూర్తిగా కలిసొస్తుంది
    on December 3, 2023 at 10:36 pm

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. 4-12-2023,   సోమవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..) జోశ్యుల విజయ రామకృష్ణ – ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు – గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  ‘శ్రీ మాతా’ వాస్తు… జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి …సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది…ఎవరికి ఇబ్బందులు ఉంటాయి …ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం   మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1): నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారా బలము అశ్విని నక్షత్రం వారికి (జన్మ తార) భరణి నక్షత్రం వారికి  (పరమైత్ర తార) కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార) దిన ఫలం:-శుభవార్త వింటారు.ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధించారు. గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఉన్నాయి.వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలు లో ఉత్సాహవంతంగా పని చేస్తారు. అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2): నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో) తారాబలం కృత్తిక నక్షత్రం వారికి  (మిత్ర తార) రోహిణి నక్షత్రం వారికి  (నైధన తార) మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార) దిన ఫలం:-ఆదాయ మార్గాలు పెరుగుతాయి . సమస్యలకు  పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం  కుదుటపడుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.   మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3): నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి) తారాబలం మృగశిర నక్షత్రం వారికి(సాధన తార) ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార) పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార) దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో అధిక రాబడి పొందుతారు.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంట్లో శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు అనుకూలం. వ్యాపారం విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు.  అన్ని విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4): నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమ తార) పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార) ఆశ్రేష నక్షత్రం వారికి (సంపత్తార) దిన ఫలం:-నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది.స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఉద్యోగుల విధి ప్రశాంతంగా సాగిపోవును. కొత్త విషయాలు తెలుసుకుంటారు.వివాదాల పరిష్కారం లభిస్తుంది.   సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1): నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే) తారాబలం మఘ నక్షత్రం వారికి (జన్మ తార) పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్ర తార) ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (మిత్ర తార) దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులూ . మిత్రులతో  మాటపట్టింపులు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు లో ప్రతిబంధకాలు.వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.   కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2): నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో) తారాబలం ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార) హస్త నక్షత్రం వారికి (నైధన తార) చిత్త నక్షత్రం వారికి (సాధన తార) దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి .ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.  ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3): నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే) తారాబలం చిత్త నక్షత్రం వారికి (సాధన తార) స్వాతి నక్షత్రం వారికి (ప్రత్యక్తార) విశాఖ  నక్షత్రం వారికి  (క్షేమతార) దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. గత కొద్ది రోజులుగా పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఉన్నత హోదా లోని వారితో  పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు తో సంతోషకరంగా గడుపుతారు. వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4): నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య తారాబలం విశాఖ నక్షత్రం వారికి  (క్షేమ తార) అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార) జ్యేష్ట నక్షత్రం వారికి  (సంపత్తార) దిన ఫలం:-వ్యయప్రయాసలు. అనారోగ్య సమస్యలు రావచ్చు. చేసే పనుల్లో అవాంతరాలు శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక విషయాలు లో నిరాశ తప్పదు.సోదరులతో మనస్పర్థలు రాగలవు.అనుకున్న వ్యవహారాలలో ఆవేశం పెరిగి ఇబ్బందులకు గురి అవుతారు.బంధువులు తో  కీలక విషయాలు చర్చిస్తారు.ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1): నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) తారాబలం మూల నక్షత్రము వారికి  (జన్మ తార) పూ.షా నక్షత్రం వారికి  (పరమైత్ర తార) ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార) దిన ఫలం:-అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి.వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.  వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. బంధుమిత్రుల వల్ల వ్యవహారాలు లో విభేదాలు కలుగును. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.  పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2): నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ) తారాబలం ఉ.షా నక్షత్రం వారికి  (మిత్ర తార) శ్రవణం నక్షత్రం వారికి  (నైధన తార) ధనిష్ఠ నక్షత్రం వారికి  (సాధన తార) దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.కొత్తగా అప్పులు చేస్తారు. బంధు వర్గము తో అకారణంగా తగాదాలు. కార్యక్రమంలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సర్దుబాటు వైఖరితో మెలగాలి.సమాజంలో మాట పడాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.   కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) తారాబలం ధనిష్ఠ నక్షత్రం వారికి (సాధన తార) శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార) పూ.భా నక్షత్రం వారికి (క్షేమ తార) దిన ఫలం:-శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. విద్యార్థుల ప్రయత్నం ఫలిస్తుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.అనుకున్న ఆదాయం సమకూరుతుంది.మానసిక ఆందోళన. ఖర్చులు పెరుగుతాయి.  ఉద్యోగాలలో గందరగోళం.   మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): నామ నక్షత్రాలు (దీ–దూఝ-దా-దే-దో-చా-చి తారాబలం పూ.భా నక్షత్రం వారికి  (క్షేమ తార) ఉ.భా  నక్షత్రం వారికి  (విపత్తార) రేవతి నక్షత్రం  వారికి  (సంపత్తార) దిన ఫలం:-తలచిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందారు.కొన్ని వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది.  వేడుకల్లో పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు లో ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు .కళాకారులు కు మరిన్ని అవకాశాలు వస్తాయి.

  • Today Panchangam :నేటి శుభ ఘడియలు ఎప్పుడున్నాయంటే..
    on December 3, 2023 at 10:00 pm

    ఈ రోజు డిసెంబర్ 3వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ – ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు – గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  ‘శ్రీ మాతా’ వాస్తు… జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి …సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.   పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 తేది :  4డిసెంబర్ 2023 శోభకృత్ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సోమవారం తిథి :- సప్తమి రాత్రి 8.28 ని॥వరకు నక్షత్రం:-  మఘ రాత్రి 11.57 ని॥వరకు యోగం:- వైధృతి రాత్రి 9.59 ని॥వరకు కరణం:- విష్ఠి ఉ॥7.26 బవ రాత్రి 8.28 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 9.17 ని॥ల 11.30 ని॥వరకు దుర్ముహూర్తం:- ప॥ 12:11 ని॥ల ప॥ 12:55 ని॥వరకు  తిరిగి మ॥ 02:23ని॥ల మ॥03:07 ని॥వరకు వర్జ్యం:- ఉ॥10.41 ని॥ల 12.27 ని॥వరకు రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు సూర్యోదయం :- 6.19 ని॥లకు సూర్యాస్తమయం:-  5.20ని॥లకు

  • Telangana Election 2023: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?
    on December 3, 2023 at 9:39 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.  ఈ నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాలు ఉండగా.. 8 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ(బీఆర్ఎస్), సిపిఐ లు చెరో ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి.   Khammam Assembly Election Results: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!    నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ 1 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్  2 ఇల్లందు (ఎస్టీ) కోరం కనకయ్య కాంగ్రెస్  3 ఖమ్మం తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్  4 పాలేరు పొంగులేటీ శ్రీనివాస్ కాంగ్రెస్  5 మధిర (ఎస్సీ) మల్లు భట్టి విక్రమార్క  కాంగ్రెస్  6 వైరా (ఎస్టీ)  మాలోతు రాందాస్  కాంగ్రెస్  7 సత్తుపల్లి (ఎస్సీ) మట్ట రాగమయి కాంగ్రెస్ 8 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు  సిపిఐ 9 అశ్వరావుపేట (ఎస్టీ) జే ఆదినారాయణ కాంగ్రెస్  10 భద్రాచలం (ఎస్టీ) తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్        

  • Telangana Election 2023: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజేతలు వీరే..  ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.
    on December 3, 2023 at 9:26 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. ఈ నేపధ్యంలో వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి వరంగల్  లో 12 స్థానాలు ఉండగా.. 10 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.   Warangal Assembly Election Results: ఉమ్మడి వరంగల్  జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!    నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ  1 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్  2 స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ) కడియం శ్రీహరి బీఆర్ఎస్ 3 పాలకుర్తి     యశస్విని రెడ్డి  కాంగ్రెస్  4 డోర్నకల్ (ఎస్టీ) జే రామ్ చంద్రు నాయక్ కాంగ్రెస్  5 మహబూబాబాద్(ఎస్టీ) మురళి నాయక్  కాంగ్రెస్  6 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్  7 పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి  కాంగ్రెస్  8 వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి   కాంగ్రెస్  9 వరంగల్ తూర్పు కొండా సురేఖ కాంగ్రెస్  10 వర్ధన్నపేట (ఎస్టీ) కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్  11 భూపాలపల్లి సత్యనారాయణరావు కాంగ్రెస్  12 ములుగు (ఎస్టీ) అనసూయ (సీతక్క) కాంగ్రెస్ 

  • Telangana Election 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజేతలు వీరే..  ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?
    on December 3, 2023 at 9:12 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి మహబుబ్ నగర్  లో 12 స్థానాలు ఉండగా.. ఏకంగా 11 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం ఒక్క స్థానాలకే పరిమితమైంది.   Nalgonda Assembly Election Results: ఉమ్మడి నల్గొండ  జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!   నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ    1 దేవరకొండ (ఎస్టీ) బాలు నాయక్  కాంగ్రెస్ 2 నాగార్జునసాగర్ కె. జైవీర్ రెడ్డి కాంగ్రెస్ 3 మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్  4 హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 5 కోదాడ ఎన్. పద్మావతి రెడ్డి  కాంగ్రెస్ 6 సూర్యాపేట జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ 7 నల్గొండ కోమటిరెడ్డి వెంకట రెడ్డి  కాంగ్రెస్  8 మునుగోడు కే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ 9 భువనగిరి కుంభం అనిల్ కుమార్  కాంగ్రెస్  10 నకిరేకల్ (ఎస్సీ) వేముల వీరేశం  కాంగ్రెస్ 11 తుంగతుర్తి మందుల సామిల్ కాంగ్రెస్ 12 ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్

  • Telangana Election 2023: ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?
    on December 3, 2023 at 9:01 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.  ఈ నేపధ్యంలో మహబుబ్ నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి మహబుబ్ నగర్  లో 14 స్థానాలు ఉండగా.. 12 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.   Mahbubnagar Assembly Election Results: ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!          నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ    1 కొడంగల్ రేవంత్ రెడ్డి  కాంగ్రెస్  2 నారాయణపేట పర్ణిక రెడ్డి చిట్టెం  కాంగ్రెస్  3 మహబూబ్ నగర్ వై .శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ 4 జడ్చర్ల అనిరుధ్ రెడ్డి   కాంగ్రెస్ 5 దేవరకద్ర     జీ. మధుసుధన్ రెడ్డి కాంగ్రెస్  6 మక్తల్ వారిటి శ్రీహరి రామ్మోహన్ కాంగ్రెస్  7 వనపర్తి మేఘారెడ్డి కాంగ్రెస్  8 గద్వాల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ 9 అలంపూర్ (ఎస్సీ) విజయుడు బీఆర్ఎస్ 10 నాగర్ కర్నూల్  కే. రాజేశ్ రెడ్డి కాంగ్రెస్  11 అచ్చంపేట (ఎస్సీ) సీహెచ్ వంశీకృష్ణ కాంగ్రెస్ 12 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ 13 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు   కాంగ్రెస్ 14 షాద్ నగర్ శంకరయ్య  కాంగ్రెస్

  • Telangana Assembly Election Results 2023: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విజేతలు వీరే..  ఏ నియోజకవర్గంలో ఎవరు గెలి
    on December 3, 2023 at 8:43 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.  ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి లో 15 స్థానాలు ఉండగా.. 7 స్థానాలను ఎంఐఎం హస్త గతం చేసుకోగా..  గులాబీ పార్టీ 7 గురు అభ్యర్థులను గెలుచుకుంది. మిగితా ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.   Hyderabad Assembly Election Results: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే! నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ    1 ముషీరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్ 2 మలక్ పేట్     అహ్మద్ బిన్ అబ్దులా బలాల ఎంఐఎం 3 అంబర్ పేట కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ 4 ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్ 5 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ 6 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ బీఆర్ఎస్ 7 నాంపల్లి మహ్మద్ మసీద్ ఉస్సేన్ ఎంఐఎం  8 కార్వాన్ కౌసర్ మోహినుద్దీన్  ఎంఐఎం  9 గోషామహల్ రాజాసింగ్ బీజేపీ 10 చార్మినార్     జుల్పీకర్ అహ్మద్ ఆలీ ఎంఐఎం 11 చాంద్రాయణ గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం 12 యాకుత్పురా జఫ్పర్ హుస్సేన్ ఎంఐఎం 13 బహదూర్పురా మహ్మద్ ముబీన్ ఎంఐఎం 14 సికింద్రాబాద్ టి. పద్మారావు బీఆర్ఎస్ 15 కంటోన్మెంట్ (ఎస్సీ) లాస్య నందిత బీఆర్ఎస్

  • Telangana Assembly Election : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?
    on December 3, 2023 at 8:16 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.  ఈ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి లో 14 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది. గులాబీ పార్టీ 10మంది అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.     RangaReddy Assembly Election Results: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!    నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ    1 మేడ్చల్ చమాకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ 2 మల్కాజ్ గిరి  మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ 3 కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద బీఆర్ఎస్ 4 కుకట్ పల్లి మాధవరాం కృష్ణారావు బీఆర్ఎస్   5 ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ 6 ఇబ్రహీంపట్నం మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్  7 ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ 8 రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ 9 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ 10 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ 11 చేవెళ్ల (ఎస్సీ) కాలె యాదయ్య బీఆర్ఎస్ 12 పరిగి టీ. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్  13 వికారాబాద్ (ఎస్సీ) గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్  14 తాండూరు బి. మనోహర్ రెడ్డి  కాంగ్రెస్  

  • Telangana Assembly Election Results 2023: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.. ?
    on December 3, 2023 at 6:54 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. ఈ నేపధ్యంలో ఉద్యమాల గడ్డ కరీంనగర్. అలాంటి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ లో 9 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.     Karimnagar Assembly Election Results: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే! . నియోజకవర్గం గెలుపొందిన                               అభ్యర్ధి పార్టీ    1 కోరుట్ల కే. సంజయ్ రావు బీఆర్ఎస్  2 జగిత్యాల టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్  3 ధర్మపురి (ఎస్సీ) లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్  4 రామగుండం మక్కాన్ సింగ్  కాంగ్రెస్   5 మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు  కాంగ్రెస్  6 పెద్దపల్లి విజయ రమణారావు కాంగ్రెస్  7 కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ 8 చొప్పదండి(ఎస్సీ)   మేడిపల్లి సత్యం  కాంగ్రెస్  9 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్  10 సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్ 11 మానకొండూరు(ఎస్సీ) కే. సత్య నారాయణ కాంగ్రెస్  12 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ 13 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్  కాంగ్రెస్ 

  • Telangana Assembly Election Results 2023: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజేతలు వీరే..
    on December 3, 2023 at 6:23 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.   ఈ నేపధ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ లో 9 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.     Nizamabad Assembly Election Results: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే! నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ  1 ఆర్మూర్ పైడీ రాకేష్ బీజేపీ 2 బోధన్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్  3 జుక్కల్ (ఎస్సీ) లక్ష్మికాంత రావు కాంగ్రెస్ 4 బాన్సువాడ పోచారం శ్రీనివాస్ బీఆర్ఎస్ 5 ఎల్లారెడ్డి     మదన్ మోహన్ రావు కాంగ్రెస్ 6 కామారెడ్డి కే.వెంకట్ రమణ రెడ్డి బీజేపీ 7 నిజామాబాద్ అర్బన్ సూర్య నారాయణ బీజేపీ 8 నిజామాబాద్ రూరల్ ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్ 9 బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్  

  • IND vs AUS: చివరి మ్యాచ్ లోనూ టీమిండియా అధిపత్యం .. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై ఘన విజయం
    on December 3, 2023 at 5:27 pm

    IND vs AUS 5th T20I: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలుపుతో ఘనంగా ముగించింది టీమిండియా. ఈ సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఆదివారం (డిసెంబర్ 3) జరిగిన సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో గెలుపు కోసం ఆసీస్ 10 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత పేసర్ అర్షదీప్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దీంతో భారత్ గెలిచింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత  20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది.  చివరిలో ఓవర్ లో ఉత్కంఠ   చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కంగరూ జట్టు విజయం సాధించాలంటే.. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిండే. ఈ 20వ ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్‌ను అవుట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి, రెండో బంతుల్లో వేడ్‌ను పరుగులు చేయకుండా నిలువరించాడు. మూడో బంతికి వేడ్ భారీ షాక్ కు ప్రయత్నించి  ఔటయ్యాడు. ఇక నాలుగో బంతికి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా గెలుపొందాలంటే.. చివరి రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చింది. నాథన్ ఎల్లిస్ ఐదో బంతికి  ఒక పరుగు మాత్రమే తీశాడు.ఆ తర్వాత బెహ్రెన్‌డార్ఫ్ స్ట్రైక్ లోకి వచ్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ముఖేష్ విధ్వంసం  ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 160 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెన్ మెక్‌డెర్మాట్ గరిష్టంగా 54 పరుగులు చేసినా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ట్రావిస్ హెడ్ 28, మాథ్యూ వేడ్ 22 పరుగులు చేశారు. ఈ ముగ్గురు మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 17 పరుగుల వద్ద టిమ్ డేవిడ్ ఔట్ కాగా, 16 పరుగుల వద్ద మాథ్యూ షార్ట్ ఔటయ్యాడు. ఆరోన్ హార్డీ ఆరు పరుగులు మాత్రమే చేయగా.. జోష్ ఫిలిప్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత్ బౌలర్ ముఖేష్ కుమార్ విధ్వంసం స్రుష్టించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి.. స్కోర్ బోర్డును కట్టడి చేశారు. ఇక అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్  అంతకుముందు.. శ్రేయాస్ అయ్యర్ తన T20 కెరీర్‌లో ఎనిమిదో అర్ధ సెంచరీని సాధించి ఆస్ట్రేలియాపై భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. జట్టు తరఫున అయ్యర్ అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 37 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 16 బంతుల్లో 24 పరుగులు, యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 21 పరుగులు చేశారు. రితురాజ్ గైక్వాడ్ 10 పరుగులు, రింకూ సింగ్ ఆరు పరుగులు, సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు, రవి బిష్ణోయ్ రెండు పరుగులు చేసి ఔట్ అయ్యారు. అర్ష్‌దీప్ రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెన్ డార్ఫ్, బెన్ డోర్సిస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా ఒక్కో విజయం సాధించారు.

  • బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ అవుట్.. నాగార్జున హెచ్చరించినా ఎవిక్షన్ పాస్ ని రిజెక్ట్ చేసిన ప్రశాంత్
    on December 3, 2023 at 5:11 pm

    కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ వీక్ కి చేరే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 8 మంది సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. నేడు సండే కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్ వీక్ సమీపిస్తుండడంతో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత దక్కబోతోందో రివీల్ చేశారు.  అక్షరాలా రూ. 50 లక్షల నగదు విన్నర్ కి దక్కుతుంది. అంతే కాదు మరిన్ని ఎక్స్ట్రా బోనాంజాలు కూడా ఉన్నాయి. మారుతి సుజుకి బ్రీజ్ కారు తో పాటు 15 లక్షల విలువ చేసే డైమండ్ జ్యువెలరీ కూడా దక్కుతుంది అని నాగార్జున ప్రకటించారు. ఆ 50లక్షలు గెలిస్తే మీరు ఏం చేస్తారు అని నాగార్జున ఇంటి సభ్యులని అడిగారు. గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి తమ కుటుంబ సభ్యుల కోసం, తల్లి దండ్రుల కోసం, సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వెచ్చిస్తాం అని బదులిచ్చారు.  ఇక శివాజీ ఇంకా తనదగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవని అన్నారు. ఇక ప్రశాంత్ మాత్రం కష్టాల్లో ఉన్న రైతులని ఆదుకునేందుకు వెచ్చిస్తా అని బదులిచ్చాడు. ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ప్రియాంక సేవ్ అయింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ వేదికపైకి కొందరు సెలెబ్రిటీ గెస్ట్ లు వచ్చారు. ముందుగా నాగార్జున ‘నా సామిరంగ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెని నాగార్జున కంటెస్టెంట్స్ పరిచయం చేశారు.  నా సామిరంగ చిత్రంలో ఆషిక పాత్రని పరిచయం చేసేలా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో ఆషిక అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంటి సభ్యులంతా ఆషికని చూసి థ్రిల్ అయ్యారు. అనంతరం నేచరుల్ స్టార్ నాని వేదికపై సందడి చేశారు.  హాయ్ నాన్న చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నాని బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. హాయ్ నాన్న విశేషాలని నాని కాసేపు నాగార్జునతో పంచుకున్నారు. అనంతరం ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాని వేసిక జోకులు అలరించాయి. నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని నాగార్జున.. నాని చేతుల మీదుగా సేవ్ చేయించారు. నామినేషన్స్ లో ఉన్న వారికి కొన్ని బాటిల్స్ ఇచ్చారు. నాని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఎవరి బాటిల్ లో గ్రీన్ ఇసుక ఉంటుందో వారు సేఫ్. శివాజీకి గ్రీన్ సాండ్ రావడంతో అతడు సేవ్ అయ్యాడు.  అనంతరం మరో సేవింగ్ రౌండ్ లో పెద్ద డ్రామానే సాగింది. చివరికి శోభా, గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్ దక్కర ఏవిక్షన్ ప్రీ పాస్ ఉంది. దానిని ఇప్పుడే వాడుకోవాలని లేకుంటే ఇంకా వాడుకోవడం కుదరదు అని నాగార్జున తెలిపారు. నీవు వాడుకొని పక్షంలో మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఇవ్వొచ్చు అని నాగార్జున చెప్పారు. అయితే ప్రశాంత్ సంచలనంగా తనకు ఏవిక్షన్ పాస్ అవసరం లేదని తాను ప్రేక్షకుల నిర్ణయం ప్రకారమే వెళతా అని నాగార్జునకి చెప్పారు.  Also Read: యానిమల్ లో వల్గర్ సీన్లు, బూతులు చూడలేదా..అనసూయని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్ ఒకవేళ తక్కువ ఓట్లు వచ్చి ఉంటే ఎలిమినేట్ అవుతావు అని నాగార్జున హెచ్చరించినా ప్రశాంత్ వినలేదు. చివరకి ప్రశాంత్ ధైర్యమే గెలిచింది. ఆ ముగ్గురిలో ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో మిగిలింది శోభా శెట్టి, గౌతమ్ మాత్రమే ఉన్నారు. వారిని నాగార్జున ప్రత్యేక రూమ్ కి తీసుకెళ్లారు. ఇద్దరి వెనుక శ్వాస తీసుకునే డ్రాగన్స్ ఉంటాయి. ఎవరి వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోతే వాళ్ళు ఎలిమినేట్. గౌతమ్ వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోయింది. దీనితో ఫైనల్ వీక్ కి ముందు ఎలిమినేటి అయిన కంటెస్టెంట్ గా నిలిచాడు. 

  • మార్షల్‌ ఆర్ట్స్ ట్రైన్‌ అవుతూ షాకిచ్చిన మీనాక్షి చౌదరి.. అందంగా ఉందని ఎక్స్ ట్రాలు చేస్తే దబిడి దబిడే
    on December 3, 2023 at 5:04 pm

    `ఖిలాడీ` చిత్రంతో కుర్రాళ్లకి ఖిలాడీ భామ అయిపోయింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత `హిట్‌` మూవీతో కుర్రాళ్లని హంట్‌ చేసింది. అందులో తనదైన గ్లామర్‌ షోతో రచ్చ చేసింది. అడవి శేషుకి జోడీగా చేసి మెప్పించింది. ఈ సినిమా విజయంతో మీనాక్షి చౌదరి పాపులర్‌ అయిపోయింది. ఆ తర్వాత ఈ  బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలు చేస్తుంది.  తెలుగుతోపాటు తమిళంలోనూ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే వెండితెరపై అందంతో ఆకట్టుకుంటుంది మీనాక్షి చౌదరి. మరోవైపు సోషల్‌ మీడియాలో తనదైన హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి కనువిందు చేసింది. కానీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. మార్షల్‌ ఆర్ట్స్ ట్రైన్‌ అవుతూ షాకిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకుంది.  ఇందులో మార్షల్‌ ఆర్ట్స్ చేస్తూ కనిపించింది. ట్రైనర్‌ వద్ద కాలితో పంచ్‌లు ఇస్తూ రచ్చ చేసింది. అదిరిపోయే పంచ్‌లతో రఫ్ఫాడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. ఇప్పటి వరకు అందంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఇలా యాక్షన్‌తో రచ్చ చేయబోతుందని చెప్పొచ్చు. దీనిపై ఆమె స్పందిస్తూ మిక్స్ డ్ మార్షల్‌ ఆర్ట్స్ ని ప్రయత్నించడం ఇదే తనకు మొదటి సారి అని, తాను ఇప్పుడు పూర్తిగా ఇష్టపడుతున్నట్టు చెప్పింది.  దీని కారణంగా తన ఒత్తిడిని దూరం చేయడంలో నేను చేసిన సరదాకి ఇక్కడ చిన్న, రక్తపు తీపి రుజువుఉంది. అద్భుతమైన కోచ్‌,మెంటర్‌గా ఉన్నందుకు నసర్బిన్ అమ్మద్‌ కి ధన్యవాదాలు తెలిపింది మీనాక్షి. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. అందగా ఉందని ఓవర్‌ యాక్షన్ చేస్తే దబిడి దిబిడే అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మీనాక్షి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇది సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.          View this post on Instagram                       A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) ఇక ప్రస్తుతం మీనాక్షి వరుణ్‌ తేజ్‌ `మట్కా` చిత్రంలో నటిస్తుంది. విశ్వక్‌ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగు `గుంటూరు కారం`లో సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. `లక్కీ భాస్కర్‌` అనే మరో సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. చివరగా అక్కడ `హత్య` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే.    

  • ‘‘ వాస్తవాన్ని ఎంచుకోండి , కలల్ని కాదు ’’ .. మోడీ వెనుక బ్యానర్‌లో ఆసక్తికర నినాదం
    on December 3, 2023 at 4:53 pm

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన అనంతరం ఆదివారం నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. హిందీ బెల్ట్‌లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది. రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ పుంజుకుంది. అయితే మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాదిలో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కోసం పార్టీ కార్యాలయంలో వేదికను ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపై నినాదాలు రాశారు. అందులోని ఒక బ్యానర్‌పై ఇలా రాసి ఉంది – ‘‘ వాస్తవాన్ని ఎంచుకోండి, కలలు కాదు, అందుకే అందరూ మోడీని ఎన్నుకుంటున్నారు’’ .     అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నేటి విజయం చారిత్రాత్మకమైనది,  అపూర్వమైనదని.. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ ఆలోచన గెలిచిందని వ్యాఖ్యానించారు. నిజాయితీ, పారదర్శకత, సుపరిపాలన కారణంగానే ఈ విజయం దక్కిందన్నారు. బీజేపీపై ప్రేమ చూపినందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణలోనూ పార్టీకి మద్ధతు లభించిందని మోడీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కులాల వారీగా దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరిగాయని.. నారీ శక్తి, యువ శక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్‌ అనే నాలుగు కులాలే ముఖ్యమని తాను నమ్ముతానని ప్రధాని తెలిపారు. ఈ నాలుగు కులాల ప్రజలు బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించారని, తాను గెలిచినట్లుగా ప్రతి పేదవాడు భావిస్తున్నారని మోడీ అన్నారు.  ALso Read: బీజేపీని ఆ నాలుగు కులాలే గెలిపించాయి.. విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని, దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని ప్రధాని హెచ్చరించారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని , జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. 2024 విజయానికి బాటలు వేసిందన్నారు. ఏ ప్రభుత్వం కావాలనే విషయంలో దేశ ప్రజలు పరిపక్వతతో వున్నారని, అన్ని రకాలుగా ఆలోచించి ఓటేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాల కార్యక్రమాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని .. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మాకు గ్యారెంటీ వుందని ప్రధాని చెప్పారు. తెలంగాణ తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, ప్రతి ఎన్నికల్లోనూ బలపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడూ పనిచేస్తామని ప్రధాని తెలిపారు.    కృతజ్ఞతా కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తూ భారత కూటమి ప్రజల్లో కులతత్వాన్ని చాటేందుకు కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదం, మద్దతుతో విపక్షాలు ప్రధాని మోదీకి వారు ఇచ్చిన దూషణలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌లలో వికసించాయన్నారు. ఇండియా కూటమిని బుజ్జగించడం, కులతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని విభజించే ప్రయత్నాలను మోడీ అభివృద్ధి అడ్డుకుంది. అభివృద్ధిని అగ్రగామిగా నిలిపి ఈ ఎన్నికల ఫలితాలను దేశం ఆమోదించిందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.    

  • Revanth Reddy: తెలంగాణలో ఇక అసలైన పాలన!.. తొలిసారి అధికారంలోకి కాంగ్రెస్, బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్
    on December 3, 2023 at 4:46 pm

    హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండోసారి ముందస్తుకు వెళ్లిన ఆ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చింది. అంటే.. కొత్త రాష్ట్రాన్ని సుమారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌కు రాష్ట్ర వనరులు, రాబడి, వ్యయాలు, ఇతర అంశాలపై వేరే ఏ పార్టీకీ లేని స్పష్టత ఉండటం సహజం. పలు శాఖలపై విస్తారమైన అవగాహన, ముఖ్యమంత్రిగానూ, రాజకీయ చాతుర్యత కేసీఆర్‌కు మెండుగా ఉన్నది. కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం, జగదీశ్ రెడ్డి వంటి బలమైన నేతలు బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇప్పుడు 2023లో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడుతూ తీర్పు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో రేవంత్ రెడ్డికి అనుభవం లేదని, ఇది వరకు ఏ మంత్రి పదవీ చేయకపోవడం మూలంగా ఈ లోటు ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.  బీఆర్ఎస్ రెండు సార్లూ అధికారంలో ఉన్నప్పుడు శాసన సభలో బలమైన ప్రతిపక్షలోటు కొనసాగింది. బీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు పోతున్నదని, నియంతృత్వ ధోరణులూ ప్రభుత్వంలో ఉన్నాయనే విమర్శలు ఈ నేపథ్యంలోనే వచ్చాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.  Also Read : Janasena Party: అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో జనసేన ఫ్లాప్ షో రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ హవా ఏమీ లేదు. ఆ పార్టీ కేవలం మెజార్టీ మార్క్ దాటి 64 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. రెండుమార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నా.. బలంగానే ఉన్నది. వామపక్ష నేత కూడా ఈ సారి అసెంబ్లీలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్రంలో బలమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంతో పాటు సంఖ్య పెంచుకున్న జాతీయ స్థాయి ప్రత్యర్థి బీజేపీని కూడా ఢీకొట్టాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవడమూ కాంగ్రెస్‌కు సవాల్‌గానే మారుతుంది. Also Read: Telangana Election Results 2023: ఒకే కుటుంబం నుంచి గెలిచిన వాళ్లు వీరే.. ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమ పథకాలు వెలువలా ప్రకటించింది. వీటిని అమలు చేసే బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీపైనే ఉన్నది. దీంతో అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మారిందని చెప్పే కాంగ్రెస్ పార్టీకి వీటికి నిధులను అడ్జస్ట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ విసిరే ప్రశ్నలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాలన అందించాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కత్తిమీద సాము చేయాల్సే ఉంటుంది. దీనికితోడు కాంగ్రెస్‌లో శృతిమించిన అంతర్గత ప్రజాస్వామ్యం ఉండనే ఉన్నది. పదవులు, హోదాలు, బాధ్యతల కేటాయింపుల్లో అలకలు, అసంతృప్తిని సర్దుకుంటూ పోవాల్సి ఉన్నది. దీనికితోడు త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ ఈ దూకుడును కొనసాగించాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రభుత్వం విజయవంతంగా సాగుతున్నట్టైనా ముద్ర వేసుకోవాల్సి ఉంటుంది. Also Read : Election Results: ముగ్గురు బీజేపీ ఎంపీల ఓటమి.. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల గెలుపు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో అసలు పాలన ఇప్పుడే మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Telangana Assembly Election Results 2023: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.
    on December 3, 2023 at 4:36 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.   ఈ నేపధ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.     Adilabad Assembly Election Results: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే! నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ  1 సిర్పూర్     పాల్వాయి హరీష్ బాబు బీజేపీ 2 చెన్నూరు (ఎస్సీ) గడ్డం వివేకానంద్ కాంగ్రెస్  3 బెలంపల్లి (ఎస్సీ) గడ్డం వినోద్  కాంగ్రెస్  4 మంచిర్యాల  కే. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్  5 అసిఫాబాద్ (ఎస్టీ) కోవా లక్ష్మి బీఆర్ఎస్ 6 ఖానాపూర్ (ఎస్టీ) వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్  7 ఆదిలాబాద్ పాయల్ శంకర్    బీజేపీ   8 బోథ్ (ఎస్టీ) అనిల్ జాదవ్ బీఆర్ఎస్  9 నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ 10 ముథోల్ రామారావు పటేల్ పవార్ బీజేపీ  

  • Telangana Assembly Election Results 2023: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..
    on December 3, 2023 at 4:15 pm

    తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.   ఈ నేపధ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ బీఆర్ఎస్ వైపే ఓట్లర్లు మొగ్గు చూపారు. అందరి అంచనాలును తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. ఉమ్మడి మెదక్ లో 10 స్థానాలు ఉండగా.. ఆరింటిలో గులాబీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.    Medak Assembly Election Results: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే! నెం. నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్ధి పార్టీ  1 సిద్దిపేట తన్నీర్ హరీష్ రావు బీఆర్ఎస్ 2 మెదక్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ 3 నారాయణఖేడ్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్  4 ఆందోల్ (ఎస్సీ) దామోదర రాజనర్సింహ కాంగ్రెస్  5 నరసాపూర్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ 6 జహీరాబాద్ (ఎస్సీ) మాణిక్ రావు బీఆర్ఎస్ 7 సంగారెడ్డి     చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ 8 పటాన్ చెరు గుడేం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ 9 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ 10 గజ్వేల్ కే. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) బీఆర్ఎస్       

  • India vs Australia , 5th T20I : పరుగులు చేయలేక అపసోపాలు పడ్డ భారత్.. ఆసీస్ విజయలక్ష్యం 161
    on December 3, 2023 at 3:50 pm

    ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో ఆసీస్ ముందు టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (53), జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహ్రన్‌డార్ఫ్ , డ్వారిషుస్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్డీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సింఘా తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ నెగ్టిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్  , రుతురాజ్ గైక్వాడ్‌లు జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఈ దశలో దూకుడుగా ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ , రుతురాజ్‌లు వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) సైతం నిరాశపరిచాడు. రింకూ సింగ్ (6) కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఈ దశలో శ్రేయస్ అయ్యర్ , జితేశ్ శర్మ , అక్షర్ పటేల్‌లు బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును నడిపించారు. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌తో స్కోరు వేగం మందగించింది. అయినప్పటికీ వీరు ముగ్గురు బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించారు. చివరికి నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది భారత్. 

  • AMB Cinemas: ఐదేళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘ఏఎంబీ సినిమాస్’.. పార్టీలో నమ్రత, గౌతమ్ హంగామా
    on December 3, 2023 at 3:29 pm

    సెలెబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, తనయుడు గౌతమ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మాన్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ఏషియన్ సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ నిర్మించిన సంగతి తెలిసిందే.    అత్యాధునిక హంగులతో ఈ మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. సినిమాని బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో వీక్షించేందుకు  ఏఎంబీ  సినిమాస్ మంచి వేదికగా సినీ ప్రియులు అక్కడికి పోటెత్తుతుంటారు.  తాజాగా ఎంఏబీ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఐదేళ్ల క్రితం ఈ మల్టీ ఫ్లెక్స్ ని ప్రారంభించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఎంబీలో సెలెబ్రేషన్స్ నిర్వహించారు.  ఈ సెలెబ్రేషన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, తనయుడు గౌతమ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకున్నారు.    ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహెష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

  • కాంగ్రెస్‌ను తిప్పికొట్టిన హిందీ బెల్ట్ .. ఉత్తరాదిలో పట్టు సడలనివ్వని బీజేపీ, ‘‘ హస్తం ’’ తప్పెక్కడ చేస్తోంది
    on December 3, 2023 at 3:21 pm

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఫలితాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ సొంతం చేసుకోగా.. వీటిలో రెండు కాంగ్రెస్ అధికారంలో వున్నవి కావడం గమనార్హం. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకుంది. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ ఎన్నికలు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.  తెలంగాణలో విజయంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోగా.. హిందీ బెల్ట్‌లో మాత్రం బీజేపీ తన పట్టు నిలుపుకుంది. హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజల తీర్పు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ప్రశ్నలకు లేవనెత్తింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే..  దాని హామీలు హిందీ బెల్ట్‌లో కనిపించకపోవడం. ప్రాంతీయ నాయకత్వంపైనే ఆ పార్టీ ఎక్కువగా ఆధారపడుతున్న వ్యూహం బెడిసి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. కమల్‌నాథ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ తమ తమ రాష్ట్రాల్లో స్వేచ్ఛగా పనిచేసేలా కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి స్థానిక నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని ఆదేశించింది. కానీ ఫలితాలను చూసినట్లయితే ఈ రాష్ట్రాల ప్రజలు మోడీ హామీలను విశ్వసిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసే కేంద్ర , రాష్ట్ర నాయకులకు జనం మద్ధతు పలికారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రత్యక్ష పోటీని ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థతను మరోసారి బట్టబయలు చేశాయి. హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం హస్తం పార్టీకే కాదు, ప్రతిపక్ష కూటమి ఇండియాకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ , బీజేపీ మధ్య ఎప్పుడూ ప్రత్యక్ష పోటీ ఉంటుంది. 2018లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లోని 61 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడంతో కాంగ్రెస్‌కు పెద్దగా ఆశలు లేవు.  కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే, పార్టీ తన హామీల గురించి హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని ప్రజలను ఒప్పించడంలో వైఫల్యం. కాంగ్రెస్ హామీలు దక్షిణాదిలో పార్టీకి సహాయపడినట్లు కనిపిస్తున్నాయి కానీ ఉత్తరాది ఓటర్లను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలను విశ్వసించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజలు వాటిని తిరస్కరించి మోడీ హామీలకు మొగ్గు చూపారు. అలాగే, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కార్డ్‌గా విశ్వసించిన కుల గణన, గణనీయమైన OBC జనాభా ఉన్న హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లోని ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం తెలంగాణలో గెలవడమే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే ఏకైక అంశం. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 3, కేసీఆర్‌ పార్టీ 9, బీజేపీ 4 గెలుపొందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో లోక్‌సభ సంఖ్యను పెంచుకోవాలని భావించిన కాంగ్రెస్‌ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యింది.   

  • Telangana Election Results 2023: కేటీఆర్ పై ఆర్జీవీ ప్రశంసలు.. ‘ప్రజాస్వామ్యానికి కావాల్సిందిదే’
    on December 3, 2023 at 3:18 pm

    హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో మెజార్టీ మార్క్‌ను దాటేసింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉన్న కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓటమిని ఆయన స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఈ ట్వీట్ పై ఆర్జీవీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్‌కు రెండు సార్లు విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ రోజు ఫలితాల గురించి బాధపడటం లేదని, కానీ, నిరాశ పడ్డానని వివరించారు. వీటిని గుణపాఠంగా తీసుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అని పేర్కొన్నారు.  In fact this will age very well sir ! That’s because I never saw any political leader taking his defeat in such a positive spirit ..KUDOS TO YOU💐💐💐 This is what’s needed for a HEALTHY DEMOCRACY 🙏🙏🙏 https://t.co/Fp00Y8MfKl — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 అంతకు ముందు ఓ గన్ షూట్ ఫొటోను పోస్టు చేసి ఇది సరిగా పోలేదని, లక్ష్యాన్ని మిస్ అయిందని కేటీఆర్ కామెంట్ చేశారు. Also Read : Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఈ కామెంట్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నిజానికి ఇది చాలా బాగా వెళ్లిందని వివరించారు. ఎందుకంటే తాను ఇది వరకు పరాజయాన్ని ఇంతటి స్పోర్టివ్ స్పిరిట్‌తో తీసుకున్న రాజకీయ నాయకుడిని చూడలేదని తెలిపారు. కుదోస్ టు యూ అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి కావాల్సిందిదే అని కామెంట్ చేశారు.

  • BREAKING: తెలంగాణ కొత్త డీజీపీ ఎవరంటే..?
    on December 3, 2023 at 2:57 pm

    Telangana New DGP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌పై ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) వేటు విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో భేటీ కావడాన్ని తప్పుబట్టింది. ఈ కారణంతో డీజీపీ అంజనీకుమార్‌ ను సస్పెన్షన్‌ వేటు విధించింది ఈసీ. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు రాకముందే రేవంత్‌రెడ్డితో భేటీ అయి కావడమే సస్పెన్షన్‌ వేటుకు కారణం. డీజీపీతో పాటు  అదనపు డీజీలు మహేష్‌ భగవత్‌,  సంజయ్‌ జైన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ఈసీ.  ఇదిలా ఉంటే.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అంజనీ కుమార్ సస్పెండ్ అయిన కొన్ని గంటల తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవి గుప్తాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన IPS రవిగుప్తా డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు.

  • `యానిమల్‌` మూవీపై ఆర్జీవీ బోల్డ్ రివ్యూ.. ఆ ఇద్దరి కాళ్లు నాకుతా అంటూ సంచలన స్టేట్‌మెంట్‌..
    on December 3, 2023 at 2:55 pm

    `యానిమల్‌` సినిమా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తుంది. రెండు రోజుల్లోనే ఇది రెండు వందల ముప్పై కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. రణ్‌ బీర్‌ కపూర్‌ నట విశ్వరూపం, రష్మిక నటన, సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్‌, బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. అంతేకాదు సందీప్‌ బోల్డ్ గా కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. దీన్నొక పిచ్చి సినిమాగా చెబుతున్నా, ఆడియెన్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. యూత్‌, మాస్‌ ఆడియెన్స్ కి పిచ్చెక్కించేలా ఉందని చెప్పొచ్చు.  ఇక తాజాగా ఈ సినిమాపై రామ్‌గోపాల్‌ వర్మ రివ్యూ ఇచ్చారు. ఆయన ఏ సినిమాకి లేనంతగా సుధీర్ఘమైన రివ్యూ ఇచ్చారు. ప్రతి సీన్‌ని, ప్రతి అంశాన్ని చర్చిస్తూ, దాన్ని వివరిస్తూ ఆయన రివ్యూ రాయడం విశేషం. తన ట్విట్టర్‌ ద్వారా వర్మ ఈ పోస్ట్ పెట్టారు. ఇందులో ప్రధానంగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్‌ గురించి, ఆయన కథని రాసిన తీరు గురించి మాట్లాడారు. సినిమా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయడం మాత్రమే కాదు, ఇంపాక్ట్ క్రియేట్‌ చేయాలి, అది చర్చించుకునేలా చేయాలి. అలా సందీప్‌ రెడ్డి వంగా `యానిమల్‌` సినిమాతో నిరూపించాడని, వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడని తెలిపారు.  బాక్సాఫీసు కలెక్షన్లు పూర్తయ్యాక కూడా కొన్ని సంవత్సరాల పాట ఈ సినిమా గురించి చర్చిస్తారని, తర్కాలు కొనసాగుతాయన్నారు. `ఈ సినిమా హిపోక్రిసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపం తో చూపించడం తో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది  అని నా ప్రఘాడ  నమ్మకం. ఎందుకంటే `యానిమల్` అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంటు` అని రాసుకొచ్చాడు వర్మ.  రష్మిక మందన్నా.. రణ్‌బీర్‌ని పట్టుకుని ఇతర అమ్మాయితో సెక్స్ లో పాల్గొనేటప్పుడు కండోమ్‌ వాడావా అని కోపపడే సన్నివేశానికి వర్మ ఫిదా అయిపోయాడట. రణ్‌బీర్‌ కపూర్‌  నటనలో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన  `రాజా హరిశ్చంద్ర ` నుంచి ఇప్పుడు 2023 వరకూ, నూట పది సంవత్సరాలలో ఏ యాక్టర్‌ చూపించలేకపోయాడని, ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశంలో తప్ప రన్బీర్ లియోనార్డో డి కాప్రియో ని కూడా మించిపోయాడని ప్రశంసలు కురిపించారు వర్మ.  `నేను ముందే చెప్పినట్టు, ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణ్‌ బీర్‌తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా , అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను` అని బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు వర్మ.  ఇక నుంచి బాలీవుడ్ లో  కానీ, టాలీవుడ్  లో  కానీ, ప్రతి సినిమా ఆఫీసుల్లోనూ `యానిమల్` సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే  ప్రతి సినిమాని  పీడిస్తుందన్నారు ఆర్జీవీ. ఇక చివరగా ఆయన చెబుతూ ఈ సినిమా చూశాక తనకు ఒక్క స్పష్టంగా అర్థమయ్యిందని, సందీప్‌కి, ఇతర దర్శకులకు ఉన్న తేడా స్పష్టంగా తెలిసిందని, ఇతర దర్శకులు అంతా.. ఆడియెన్స్ తమకంటే తక్కువగా ఉంటారనే ఆలోచనలో ఉన్నారని నమ్ముతారని, కానీ సందీప్‌ ఆడియెన్స్ అంతా తనలాగే ఉన్నారని నమ్ముతాడని చెప్పడం విశేషం.  ఇక వర్మ పూర్తి రివ్యూని ఆయన ట్విట్‌లో చూడొచ్చు…   “యానిమల్ ” సినిమా గురించి నా రివ్యూ – రామ్ గోపాల్ వర్మ https://t.co/QlP7onjEQY — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023 After watching ANIMAL I realised that the difference between @imvangasandeep and other mass commercial directors is that THEY all believe that the audience are far below them , and HE believes that all the audience are exactly like him — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023

  • హరీష్ రావు ఘన విజయం.. ఈ సారి ఎంత మెజార్టీ సాధించారంటే.?  
    on December 3, 2023 at 2:30 pm

    Harish Rao: హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఓటమి చవిచూడని నేత. అవి సాధారణ ఎన్నికలైనా.. బై ఎలక్షన్ అయినా .. ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యం. భారీ మెజారిటీతో విజయం సాధించడం హరీష్ రావుకు అలవాటుగా మారింది. సిద్దిపేట నియోజక వర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తూ హరీష్ రావు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఘన విజయం సాధించారు. తాజా 2023 తెలంగాణ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. తనకు ఎదురులేని చాటుకున్నారు.  గత ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన హరీశ్ రావు .. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించినా గత ఎన్నికల కంటే కాస్త మెజారిటీ తగ్గింది.  ఈ ఎన్నికల్లో సిద్దిపేటలో మొత్తం 1,78,420 ఓట్లు పోలవ్వగా..వీటిలో హరీష్ రావుకు.. లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. అంటే.. 1,04,109 ఓట్లు వచ్చాయి. తన సమీప అభ్యర్థి అయిన పూజల హరికృష్ణకు 22,489 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో హరీష్ రావు 83,025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోసారి తనకు తిరుగులేదంటూ నిరూపించుకున్నారు.  ఈ సారి మెజార్టీ తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. ఈ ఎన్నికల్లో (సిద్దిపేట నియోజకవర్గం) 76.33 శాతం ఓటింగ్‌ నమోదుగా..  గత (2018లో) ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే.. గత ఎన్నికల కంటే.. ఈసారి పోలింగ్ తగ్గింది. ఆయనపై వ్యతిరేకత కాకున్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత.. అలాగే.. పోలింగ్ శాతం తగ్గటం ఇందుకు కారణం కావొచ్చని భావిస్తున్నారు.   ఈ క్రమంలో హరీశ్ రావు అరుదైన రికార్డు సాధించారు. కారు గుర్తుపై ఇప్పటి వరకు ఏడుసార్లు గెలుపొందిన ఏకైక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హరీష్ రావు నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తెలంగాణలో రికార్డు స్థాయిలో నాలుగు విజయాలు టీడీపీ టిక్కెట్‌పైనే ఉన్నాయి. తెలంగాణలో  తెలంగాణ ఎన్నిక తరువాత ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. అని ట్వీట్ చేశారు. 

  • Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు ఎమ్మెల్యే
    on December 3, 2023 at 2:17 pm

    హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ అసెంబ్లీలోకి వామపక్ష నేత అడుగు పెట్టబోతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఈ సీటులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బరిలో దిగారు. కూనంనేనికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నిలిచాయి. కూనంనేని సాంబశివరావుకు 80,336 ఓట్లు పోలయ్యాయి. 26,547 ఓట్ల మార్జిన్‌తో కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. దీంతో ఈ సారి తెలంగాణ అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగు పెట్టనున్నారు. అదే.. కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు వికటించి సీపీఎం సొంతంగా పోటీకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. Also Read: Telangana Election Results 2023: ఒకే కుటుంబం నుంచి గెలిచిన వాళ్లు వీరే.. ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వామపక్షాల నుంచి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ నుంచి రవీంద్ర కుమార్ గెలుపొందారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లోనే భద్రాచలం నుంచి సీపీఎం నేత సున్నం రాజయ్య శాసన సభకు వెళ్లారు. వీరిద్దరూ అసెంబ్లీలో కొనసాగారు. మళ్లీ 2018లో వామపక్షాల నుంచి ప్రాతినిధ్యం శాసన సభలో లేకుండా పోయింది. ఈ సారి మళ్లీ 2023 ఎన్నికల్లో సీపీఐ నుంచి కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు గెలిచి అసెంబ్లీకి వెళ్లుతున్నారు.