- రామ్ చరణ్ NO చెప్పిన 5 సినిమాలు.. వాటి బాక్సాఫీసు రిజల్ట్ లుon April 27, 2024 at 5:57 am
చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 17 ఏళ్లు గడిచాయి. ఈ 17ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో చిరంజీవికి మంచి జడ్జిమెంట్ ఉందని చెప్తారు. ఆయన కథ విని వర్కవుట్ అవుతుందంటే మాగ్జిమం ఆడుతుంది. ఆయన నో చెప్పిన కథలు దాదాపుగా ఆడలేదని చెప్తారు. అయితే బయిటకు వెళ్లిన ఆ కథలు చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేసి హిట్ కొట్టిన ధాకలాలు ఉన్నాయి. అదే పద్దతి రామ్ చరణ్ కు వచ్చిందని చెప్పుకుంటారు. సాధారణంగా చిరంజీవి లేదా రామ్ చరణ్ లేదా ఏ పెద్ద హీరో దగ్గరకైనా కథ వెళ్లాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది. ఓ మాదరి రైటర్స్ అయితే చాలా మందికి ఆ కథ చెప్తారు. అక్కడే ఫిల్టరైపోతుంది. అన్ని దాటుకుని రామ్ చరణ్ దాకా వెళ్లాలంటే అందులో ఎంతో కొంత విషయం ఉంటుంది. అయితే ఆ విషయం తమకు పనికివస్తుందా లేదా అనేది వాళ్లు చూసుకుంటారు. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రిజక్ట్ చేసిన ఐదు సినిమాలు ..వాటి రిజల్ట్ లు చూద్దాం. అయితే ఇవి మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు గౌతమ్…సూర్య సన్నాఫ్ కృష్ణన్ కధను ముందు రామ్ చరణ్ కు విన్పించారు. అయితే చిరుత విడుదలై అప్పటికి ఏడాదే కావడంతో డ్యూయర్ రోల్ లో అదీ తండ్రి పాత్రలో కనిపించే పాత్ర సినిమా వద్దనుకున్నాడు. నో చెప్పారు. ఆ తర్వాత సూర్య హీరోగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాటలు సూపర్ హిట్. తెలుగులో మాత్రం ఆడలేదు. తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ (Surya Son of Krishnan) ఆయన అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. తండ్రిగా, కొడుకుగా సూర్య పెర్ఫామెన్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ను కదిలిస్తుంది. మత్తుకు అలవాటైన కొడుకును మార్చే తండ్రి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2008లో ఈ చిత్రం విడుదలైంది. సిమ్రాన్, సమీరా రెడ్డి హీరోయిన్లు. గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకుడు. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఓకే బంగారం కథ మొదట రామ్ చరణ్ విన్నారు. కొద్ది రోజులు డిస్కషన్స్ జరిగాయి. అయితే అంత సున్నితంగా ఉన్న కథ తెలుగులో వర్కవుట్ కాదని చెప్పి రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు. నిజంగానే ఆ తర్వాత డబ్ చేసి తెలుగులో వదిలినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యామీనన్, దుల్కర్ కలిసి నటించినా, సూపర్ హిట్స్ పాటలు ఉన్నా బిలో యావరేజ్ అయ్యింది. ఇక నాని హీరో గా వచ్చి డిజాస్టర్ అయిన కృష్ణార్జున యుద్ధం కథ కూడా మొదట రామ్ చరణ్ కే వెళ్లిందట. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వరుస విజయాల్ని అందించిన మేర్లపాక గాంధీ..కృష్ణార్జున యుద్ధం కధ ఫెరఫెక్ట్ గా రామ్ చరణ్ సెట్ అవుతుందనుకున్నారట. అయితే ద్విపాత్రాభినయం బాగున్నా కధలో కొత్తదనం లేదని నిరాకరించాడు చెర్రీ. తరువాత ఇదే సినిమా నానీ హీరోగా విడుదలైంది. సినిమా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ చేసిన నేల టికెట్ కథ రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళగా ఆ కథ కూడా తనకి సెట్ కాదని నో చెప్పాడట.సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాలతో ఉన్న దర్శకుడు అయినా కథలో మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవటం లేదని, నేల టిక్కెట్టు వర్కవుట్ కాదని రామ్ చరణ్ చెప్పారట. అయితే కొద్దిపాటి మార్పులతో మళ్లీ కలిసినా గ్రీన్ సిగ్నల్ రాలేదట. దాంతో దర్శకుడు కృష్ణ కురసాల అనంతరం ఈ సినిమా రవితేజ హీరోగా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. 25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.; గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏటో వెళ్ళిపోయింది మనసు కథ మొదట రామ్ చరణ్ దగ్గరకే వచ్చిందిట. అయితే తన మాస్ ఇమేజ్ కు ఈ కథ వర్కవుట్ అవదని సున్నితంగా చెప్పారట. అప్పుడు నాగార్జున కు చెప్పటం, నాని, సమంత కాంబినేషన్ లో చేయటం, బ్లాక్ బస్టర్ హిట్ అవటం జరిగింది. అయితే రామ్ చరణ్ తో చేస్తే ఆ స్దాయిలో హిట్ అయ్యేదా అంటారా.. బుచ్చితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గానూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత కీలకపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
- నాని సహజ నటుడైతే, నువ్వు మట్టి యాక్టర్.. సుకుమార్ మాటలకు ఎమోషనలైన సుహాస్on April 27, 2024 at 5:57 am
నాని సహజ నటుడైతే, నువ్వు మట్టి యాక్టర్.. సుకుమార్ మాటలకు ఎమోషనలైన సుహాస్
- నువ్వే గెలుస్తవ్ అన్నా.. ఈటెల రాజేందర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి హిలేరియస్ ఫన్..on April 27, 2024 at 5:35 am
నువ్వే గెలుస్తవ్ అన్నా.. ఈటెల రాజేందర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి హిలేరియస్ ఫన్..
- మహిళలు బ్రా ఎందుకు ధరించాలో మీకు తెలుసా?on April 27, 2024 at 5:16 am
దాదాపు చాలా మంది మహిళలు ప్రతిరోజూ బ్రా ధరిస్తారు. కొందరు వీటిని ధరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మహిళలు చాలా రకాల దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అయితే.. ఎలాంటి డ్రెస్ వేసినా బాడీ మంచి పర్ఫెక్ట్ షేప్ లో కనిపించాలి అంటే… కచ్చితంగా వారు బ్రా ధరించాల్సిందే. ఎదుకంటే.. బ్రా ధరించడం వల్ల… శరీరానికి మంచి ఆకారం, పరిమాణం వస్తుంది. అంతేకాదు.. చెస్ట్ పార్ట్ కి మంచి సపోర్టివ్ గా నిలుస్తుంది. దాదాపు చాలా మంది మహిళలు ప్రతిరోజూ బ్రా ధరిస్తారు. కొందరు వీటిని ధరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్రా ధరించడం వల్ల ఆ ప్రదేశంలో మచ్చలు పడుతున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని చాలా రకాలుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా స్కిప్ చేయాలా అని చూస్తూ ఉంటారు. కానీ.. రోజూ బ్రా ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం… బ్రా ధరించకపోతే రొమ్ములు సాగిపోయినట్లుగా అవుతాయి. అదే బ్రా ధరించడం వల్ల.. రొమ్ములకు మంచి సపోర్ట్ అందిస్తుంది. పెద్ద ఛాతీ ఉన్న మహిళలకు బ్రా ధరించడం చాలా ముఖ్యం. ఇది రొమ్ములు కుంగిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రా రొమ్ములకు మంచి ఆకృతిని ఇస్తుంది, ఇది కుంగిపోయిన రొమ్ములను కలిగి ఉండే అవకాశాలను తగ్గిస్తుంది. ఇది కొంతమంది మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చాలా మందికి వ్యాయామాం, రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసే సమయంలో రొమ్ములు ఊగుతూ చాలా నొప్పిని కలిగిస్తాయి. అదే ఆ సమయంలో స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే… చాలా రిలీఫ్ గా ఉంటుంది. మీరు ఉదయం కొంత వ్యాయామం చేస్తే, బ్రా మంచి మద్దతును అందిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకపోవడానికి ఇదే కారణం. బ్రా ధరించకుండా వ్యాయామం చేయడం వల్ల నొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే… బ్రా ధరించడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.. కొంతమంది మహిళలు బ్రా ధరించడం అసౌకర్యంగా భావిస్తారు. కొందరు మహిళలకు బ్రాలు ధరించినప్పుడు చాలా చెమటలు పడతాయి, ఇది మొటిమలు , ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఆకారం కోసం నిరంతరం బ్రా ధరించడం వల్ల రొమ్ము కణజాలం దెబ్బతింటుంది. బ్రా ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. మీ వీలును బట్టి.. కంఫర్ట్ గా ఉండేవి ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా కాటన్ క్లాత్ తో ఉన్నవి ఎంచుకుంటే.. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి. మరీ టైట్ గా కూడా ఉండేవి కూడా వేసుకోకపోవడమే మంచిది.
- చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులు ఏం చేయొద్దో తెలుసా?on April 27, 2024 at 5:15 am
చాణక్య నీతిలో మన జవీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి వివరించబడి ఉన్నాయి. వీటిని పాటిస్తే గనుక మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. ఇలాంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలివైన వ్యక్తులు ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖసంతోషాలతో, విజయవంతంగా మలచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తెలివైన వ్యక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తెలివైన వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కూడా శత్రువు, బలహీనమైన స్నేహితుడి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ సంతోషాలను చూసి ఓర్వలేరు. ఇది వాళ్లకు బాధ కలిగిస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రదేశానికి వెళ్లొద్దు మీకు గౌరవం లేని చోట మీరు వెళ్లకపోవడమే మంచిది. అలాగే సంపాదన, జ్ఞానం లేని ప్రదేశంలో కూడా మీరు ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. అలాగే స్నేహితులు, బంధువులు లేని చోట నివసించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది. కర్మ జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు రెండు ఫార్ములాల గురించి వివరించాడు. చాణక్య నీతి ప్రకారం.. ఒక పక్షి తన రెండు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగరగలిగినట్టే.. కర్మ, జ్ఞానం అనే రెండు రెక్కల ఆధారంగా ఒక వ్యక్తి కూడా విజయ ఆకాశంలో ఎగరగలుగుతాడు.
- సినిమా స్టయిల్లో ప్రాసలు, పంచ్లతో రెచ్చిపోయిన బాలయ్య.. అరుపులు, కేకలతో జనం రచ్చ..on April 27, 2024 at 5:04 am
సినిమా స్టయిల్లో ప్రాసలు, పంచ్లతో రెచ్చిపోయిన బాలయ్య.. అరుపులు, కేకలతో జనం రచ్చ..
- Vampire facial: అందం కోసం ఆరాట పడితే.. ప్రమాదంలో పడ్డ ప్రాణాలు.. అసలేం జరిగిందంటే?on April 27, 2024 at 4:48 am
Vampire facial: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలని ఎన్నో ఎన్నో ఫేసియల్స్ చేయించుకుంటారు. ఇవి తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా అత్యాధునిక శాస్ర్త చిక్సితలు, స్కిన్ కేర్ థెరఫీలు చేయించుకుంటారు. ఇలాంటి తరుణంలో కొంతమంది తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటే నమ్ముతారా? ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు ప్రాణాంతకమైన HIV బారిన పడ్డారని CDC తెలిపింది. అసలేం జరిగింది? వాంపైర్ ఫేషియల్లో చేతుల నుండి రక్తాన్ని తీసి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. దీనిని ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ ప్రక్రియ అంటారు. దీనిని సాధారణంగా ఫేషియల్ అని పిలుస్తారు. 2018లో మెక్సికోలోని ఓ స్పా (బ్యూటీ పార్లర్ )లో కొంత మంది మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. అనంతరం ఆ మహిళలను పరీక్షించగా.. వారికి హెచ్ఐవి సోకినట్లు తేలింది. మహిళలకు వాడే కాస్మోటిక్ ఇంజెక్షన్ల వల్లే హెచ్ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. RML హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ మాట్లాడుతూ.. HIV సోకిన వ్యక్తి రక్తం ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశించడం వల్ల HIV వస్తుందని చెప్పారు. CDC అన్ని విధాలుగా పరిశోధించింది. మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని లేదా ఆమెకు సోకిన రక్తమార్పిడి ఇవ్వలేదని లేదా ఆమె HIV పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధం కలిగి లేదని కనుగొనబడింది. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగా బాధితురాలికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తేలింది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్పాల నిర్లక్ష్యం అనే సమస్య 2019 సంవత్సరంలో కూడా తలెత్తింది. న్యూ మెక్సికో ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల తర్వాత ఈ స్పా మూసివేయబడింది. అలాగే ఇక్కడ ఫేషియల్ వాంపింగ్ చేయించుకున్న వారికి అనేక పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్పా లోని వెళ్లే సుమారు 200 మందిని పరిశీలించారు. అయితే.. వారిలో ఎవరికీ వ్యాధి సోకలేదని తేలింది. వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి? వాంపైర్ ఫేషియల్స్(Vampire facial) అనే ట్రిట్మెంట్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కాస్మెటిక్ ప్రక్రియ ద్వారా ముడతలు పడ్డ చర్మాన్ని యవ్వనంగా మారుస్తారు. అలాగే.. మొటిమలు, మచ్చలు, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం.. ఈ వాంపైర్ ఫేషియల్ ప్రక్రియ మొత్తం 40 నుండి 50 నిమిషాలు పడుతుంది. ముఖంపై మచ్చలు లేదా ఇతర గుర్తులు ఉంటే..వాటిని తొలగించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. చేతి నుంచి తీసిన రక్తాన్ని ఇంజక్షన్ సహాయంతో అదే వ్యక్తి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. వాంపైర్ ఫేషియల్ వంటి పద్ధతులను ప్రయత్నించిన తర్వాత.. ఈ ప్లేట్లెట్స్ కొత్త చర్మ కణాలు, కొల్లాజెన్ల పెరుగుదలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. సరైన అనుభవం ఉన్న డాక్టర్ చేతనే ఈ ట్రిట్మెంట్ చేయించుకోవాలని నిణుపులు తెలుపుతున్నారు.
- నన్ను టీవీల్లో చూపించడం లేదు.. మీ కుటుంబాలన్నీ నాశనం.. మీడియాపై కేఏ పాల్ ఫైర్on April 27, 2024 at 4:28 am
నన్ను టీవీల్లో చూపించడం లేదు.. మీ కుటుంబాలన్నీ నాశనం.. మీడియాపై కేఏ పాల్ ఫైర్
- ఎందుకు ఎక్కువ తింటరో తెలుసా?on April 27, 2024 at 4:25 am
బాగా తింటూ, ఎలాంటి శారీరక శ్రమ చేయకుంటే ఈజీగా బరువు పెరిగిపోతారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు పెరగడానికి అసలు కారణం హెవీగా తినడమే. అయితే ఇలా హెవీగా ఎందుకు తింటారో తెలిస్తే షాక్ అవుతారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాల పోషకాలు అవసరమన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హెల్తీ ఫుడ్ ను తినాలని సూచిస్తుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అయితే మన శరీరంలో ఏ ఒక్క పోషకం లోపించినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు మన శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తే కూడా ఊబకాయం బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా తిన్నా, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఊబకాయం బారిన పడతారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇది నిజమే అయినా .. శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా ఊబకాయం బారిన పడుతుంటారు. ఏయే పోషకాల వల్ల ఊబకాయం బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. విటమిన్ డి మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలాచాలా అవసరం. కానీ మీ శరీరంలో ఈ పోషకం లోపిస్తే జీవక్రియ, ఇన్సులిన్ సున్నితత్వం దెబ్బతింటుంది. ఇది కొవ్వు కరగడాన్ని దెబ్బతీస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఈ కొవ్వు ఆమ్లాలు లోపిస్తే ఆకలి హార్మోన్లు దెబ్బతింటాయి. దీనివల్ల మీరు కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తింటారు. అలాగే ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. ప్రోటీన్ ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం. ఇది మన ఎముకలు, కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. మన శరీరానికి ప్రోటీనే శక్తి వనరు. అయితే ప్రోటీన్ లోపిస్తే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్ బి మన శరీరం మొత్తం అభివృద్ధికి బి12, బి6 వంటి విటమిన్ బి లు చాలా అవసరం. మీ శరీరంలో ఇది లోపిస్తే మీరు బాగా అలసటకు గురవుతారు. అలాగే చక్కెర కోరికలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయోడిన్ మన శరీరానికి అయోడిన్ చాలా చాలా అవసరమైన పోషకం. ఇది లోపిస్తే హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇనుము సాధారణంగా ఇనుము లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇనుము లోపం వల్ల ఒక్క రక్తహీనత సమస్య మాత్రమే కాదు ఇది అలసటకు కూడా దారితీస్తుంది. అలాగే జీవక్రియకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది.
- సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?on April 27, 2024 at 4:19 am
కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్. నిజానికి పండ్ల రసాలు తాగినంత ఇష్టంగా బీట్ రూట్ జ్యూస్ తాగలేం. కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ ఎండాకాలం ఉదయం లేచే సరికి ఫేస్ అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దానిని కూడా ఈ బీట్ రూట్ జ్యూస్ తగ్గిస్తుంది. అంతేకాదు.. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..బాడీ లోని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెటబాలిజం మెరుగుపరుస్తుంది. మండే ఎండల్లో శరీరానికి ఊరట కలిగిస్తుంది. మనం సాధారణంగా ఎండకాలం ఎక్కువ సేపు వ్యాయామాలు చేయలేం. అందుకే బాడీ సహకరించదు. కానీ.. ఈ ఎండల్లోనూ ఎలాంటి యాక్టివిటీ చేసినా అలసిపోకుండా ఉండేలా చేయడంలో ఈ బీట్ రూట్ జ్యూస్ సహాయం చేస్తుంది. మన పర్ఫార్మెన్స్ , స్టామినా పెంచుతుంది. బీట్ రూట్ లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి అందిస్తుంది. అంతేకాకుండా.. ఎండల ద్వారా వచ్చే నీరసాన్ని తగ్గించి.. తక్షణ ఎనర్జీని అందిస్తుంది. ఈ ఎండల్లో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఎనర్జీ అందించే ఎలక్ట్రో లైట్స్ కూడా ఉంటాయి. అంతేకాదు.. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మన అందం కూడా రెట్టింపు అవుతుంది. సన్ వల్ల జరిగే స్కిన్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం అందంగా కనిపించడంలో సహాయం చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంలోనూ సహాయం చేస్తుంది.
- ‘మేకప్ రూమ్లో బంధించి,వేధించాడు,బట్టలు కట్టుకుంటూంటే దారుణంగా..’: నిర్మాత పై ‘సీరియల్ హీరోయిన్ ‘ కంప్లైంట్on April 27, 2024 at 4:17 am
నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది. సినీ,టీవీ పరిశ్రమ రంగం ఇంతగా అభివృధ్ది చెందినా, మీడియా తో అందరూ ఇంటరాక్ట్ అవుతున్నా కొన్ని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని బయటకు వస్తున్నాయి., మరికొన్ని భయాలతో అక్కడికక్కడే సమాధి అయ్యిపోతున్నాయి. వేధింపులుకు తట్టుకోలేని కొందరు సోషల్ మీడియా ద్వారా బయిటకు వస్తున్నారు. అలా తాజాగా తానను మేకప్ రూమ్లో బంధించి వేధించారంటూ ఓ పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీవీ మీడియాని కుదిపేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే… పాపులర్ టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ అంటే టీవి సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా యే హై మొహబ్బతీన్ లో ఆమె నటన చూసి ఫిదా అయ్యిపోయారు. ఆ సీరియల్ జనాలకు తెగ నచ్చేసింది. దాదాపు పదేళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమె వరస పెట్టి షోలు, సీరియల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగిన్ 3 ,కుచ్ తో హై , నాగిన్ ఏక్ నయా రంగ్ మే, శుభ్ సౌగన్ వంటి షోలు, సీరియల్స్ కృష్ణ ముఖర్జికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా టీవి ఇండస్ట్రీలో ఆమె సెలబ్రెటీ హోదాను అనుభవిస్తోంది. అయితే ఆ స్దాయి నటికు కూడా వేధింపులు ఉంటాయని అంటే ఎవరు నమ్మలేరు. కానీ ఆమే స్వయంగా తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో తనను నిర్మాత వేధిస్తున్నాడని వాపోతూ పోస్ట్ పెట్టడం షాక్ ఇచ్చింది. కృష్ణ ముఖర్జీ తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో ఏప్రియల్ 26, 2024 న పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో ఆమె దాదాపు ఏడాదిన్నరగా ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది చెప్పుకొచ్చింది. ఇంతకాలం ఈ ఇష్యూ మీద మాట్లాడటానికి ధైర్యం చాలలేదని, తాను సర్దుపోదామనుకున్నా కుదరలేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాను ఎలాంటి సిట్యువేషన్ అయినా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యినట్లు చెప్పింది. శుభ్ షోగన్ నిర్మాత కుందన్ సింగ్ ని ట్యాగ్చేస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఆ ప్రొడక్షన్ హౌస్ వారు, నిర్మాత తనని చాలా టార్చర్ పెట్టారని, లిటరల్ గా హెరాస్ చేసారని చెప్పుకొచ్చింది. ఆ వేధింపులు చెప్పుకోలేని విధంగా ఉన్నాయని, తట్టుకోలేకే ఇలా ధైర్యంగా సోషల్ మీడియా ద్వారా బయిటపెట్టాల్సి వచ్చిందని అంది. స్టార్ ప్లస్’ పాపులర్ షో ‘యే హై మొహబ్బతే’తో అరంగేట్రం చేసిన తాను ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని, దంగల్ టీవీ లో ప్రసారం అవుతున్న ‘శుభ్ షగున్’ కే తనకు వేధింపులు ఎదురయ్యాయని అంది. ఆ షోలో షెహజాదా ధామీ సరసన కనిపించింది. ఈ క్రమంలో కృష్ణ ముఖర్జీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో శుభ్ షాగున్ నిర్మాత గురించి షాకింగ్ రివీల్ చేసారు. నిర్మాత కారణంగా తాను గత కొన్ని నెలలుగా డిప్రెషన్తో, ఆందోళనకు గురవుతున్నానని, షో సెట్స్లో తనను వేధించారని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ…తనకు అనారోగ్యంగా ఉన్నానని,షూటింగ్ చేయలేనని చెప్పటంతో తనను మేకప్ గది లోపల లాక్ చేసారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సంస్ద తనకు గత 5 నెలలుగా తన బకాయిలు క్లియర్ చేయలేదని పేర్కొంది. నిర్మాత నుండి బెదిరింపులు వస్తున్నాయని కృష్ణ కూడా వెల్లడించాడు మరియు ఆమె మాట్లాడటానికి భయపడిందని పేర్కొంది. తాను సేఫ్ గా లేనని, అందుకే ఏ షోకు వెళ్లలేకపోతునన్నానని, ఆ నిర్మాత నుంచి రక్షణ కోరుతున్నట్లుగా ఆమె ఆవేదనతో చెప్పింది. ఆ షో టీమ్ …నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది. అదెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. వారు 5 నెలలుగా పేమెంట్స్ లేవు. అది నిజంగా పెద్ద మొత్తం. నేను ప్రొడక్షన్ హౌస్ , దంగల్ ఆఫీస్కి వెళ్ళాను కానీ వాళ్లు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు ఇంతలా మాట్లాడే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఈ రోజు నేను దానిని వెనక్కి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను కష్టమైన పరిస్దితులను ఎదుర్కొంటున్నాను మరియు గత ఒకటిన్నర సంవత్సరం నాకు చుక్కలు చూపించింది. ఈ విషయమై నేను చాలా మంది ని సాయం చేయమని అడిగాను కానీ ఏమీ ఫలితం లేదు. దాని గురించి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్ కు లోనయ్యాను, గుండెలవిసేలా ఏడ్చాను. దంగల్ టీవీ కోసం నా చివరి షో” శుభ్ షగున్” చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. “అది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం. నేనెప్పుడూ అలా చేయాలనుకోలేదు కానీ ఇతరుల మాటలు విని ఒప్పందంపై సంతకం చేశాను అంది. ఇది రాస్తున్న సమయంలో నా చేతులు వణుకుతున్నాయి. నేను ఏంగ్జైటీ, డిప్రెషన్ తో పోరాడుతున్నాను. సోషల్ మీడియాలో సాధారణంగా మన ఎమోషన్స్ ని దాచి, మన బ్రైటర్ సైడ్ ని చూపెడుతున్నాము. కానీ ఇదీ అసలైన నిజం . నా కుటుంబం నన్ను ఇలాంటివి పోస్ట్ చేయద్దని చెప్తున్నారు. వాళ్లు నిన్ను ఏదైనా చేస్తే ఏంటి పరిస్దితి అని భయపడుతున్నారు. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. నాకు న్యాయం కావాలి. ఇది నా హక్కు అంది. నేను బయిటకు వెళ్లినప్పుడు నేను ఎందుకు ఏ షో చేయడం లేదని ప్రజలు నన్ను అడుగుతారు?. ఇదీ కారణం. అర్దం చేసుకోండి. మళ్లీ అదే సంఘటనలు రిపీట్ అవుతాయేమో అని నాకు భయంగా ఉంది?? నాకు న్యాయం కావాలి.” ఆమె రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. కృష్ణ ముఖర్జీ ఈ పోస్ట్ను ఇనిస్ట్రాలో పెట్టిన వెంటనే, ఆమె స్నేహితులు మరియు తోటి నటీనటులు తమ సపోర్ట్ అందించారు. ఆ నిర్మాత ముంబైకి తిరిగి వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. టీవి రంగానికి చెందిన శ్రద్ధా ఆర్య, నీనా కులకర్ణి, షిరీన్ మీర్జా మరియు ఇతరులు కూడా నిర్మాతపై పోరాడేందుకు తమ సపోర్ట్ ని అందించారు. నాగిన్ మరియు కుచ్ తో హై చిత్రాలలో కూడా కనిపించిన కృష్ణ ముఖర్జీ గత సంవత్సరం మార్చిలో బ్యూటీ చిరాగ్ బట్లీవాలాను వివాహం చేసుకున్నారు. ఈ వివాదం తర్వాత ఆమె షోలకు గ్యాప్ ఇస్తుందని చెప్తున్నారు. అయితే ఆమె కొత్తగా ఏ సీరియల్ కమిటవ్వలేదని వినికిడి. అలాగే ఈ వివాదంపై ఇంకా ప్రొడ్యూసర్ ఏమీ స్పందించలేదు.
- `వకీల్ సాబ్` రీ రిలీజ్.. ఎన్నికల మైలేజ్కోసం పవన్ సినిమా మళ్లీ విడుదల?on April 27, 2024 at 4:01 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించాల్సిన మూడు సినిమాలను పక్కనపెట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. జోరుగా ఆయన ప్రచారం జరుగుతుంది. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన సినిమా మళ్లీ రిలీజ్ కాబోతుంది. పవన్ నటించిన `వకీల్ సాబ్` మూడేళ్ల క్రితం వచ్చి మంచి విజయం సాధించింది. బాలీవుడ్లో వచ్చిన `పింక్` చిత్రానికిది రీమేక్. ముగ్గురు అమ్మాయిలను దుండగులు వేధించిన కేసుకి సంబంధించిన కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రాజకీయ నాయకుడి కొడుకు ఆ అమ్మాయిలపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తుంటారు. ఆ కేసుని హీరో వాదిస్తాడు. ఎలా వాదించాడు, కోర్టు లో నాయకుడి కొడుకుని ఎలా దోషిగా నిలబెట్టాడనేది ఈ మూవీ కథ. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు. పవన్కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9న విడుదలైంది. కరోనా సమయంలోనూ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాని రీ రిలీజ్చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఏపిలో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది పవన్ కి ఎన్నికల పరంగా పాజిటివ్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో ఆయనకు మైలేజీని తీసుకొస్తుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల రీ రిలీజ్ల ట్రెండ్ డౌన్ అయ్యింది. థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఒకటి అర అరుదుగా అలరిస్తున్నాయి, తప్ప పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. పైగా ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ నటించాల్సిన చిత్రాల్లో `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. ఇందులో సుజీత్ రూపొందిస్తున్న `ఓజీ`లో పవన్ ఇరవై రోజులు షూటింగ్లో పాల్గొంటే సినిమా అయిపోతుంది. దీన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ రూపొందిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు పవన్. చివరగా `హరిహరవీరమల్లు` చిత్రీకరణలో పాల్గొంటాడని సమాచారం.
- Lok Sabha Elections: అధికారం నిర్ణయించడంలో ఆ స్థానాలే కీలకం.. on April 27, 2024 at 3:26 am
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల రెండో విడతలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ దశలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మోడీ ప్రభుత్వంలోని 5 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల విశ్వసనీయత ప్రమాదంలో పడింది. ఈ దశ కూడా ముఖ్యమైనది.. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ 88 సీట్లలో 60 శాతం గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్ 20 శాతం సీట్లకే పరిమితమైంది. అయితే రెండో దశలో రాజకీయ రంగు పులుముకునే సీట్లు చాలానే ఉన్నాయి. దీని కారణంగా.. ఈ దశ దేశ శక్తి విధిని నిర్ణయిస్తుందని నమ్ముతారు. రెండో దశలో ఓటింగ్ జరుగుతున్న 88 స్థానాల్లో 1198 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో 1097 మంది పురుషులు, 100 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు. రెండో దశలో అసోం నుంచి 5, బీహార్ నుంచి 5, ఛత్తీస్గఢ్ నుంచి 3, కర్ణాటక నుంచి 14, కేరళ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి 8, రాజస్థాన్ నుంచి 13, ఉత్తరప్రదేశ్ నుంచి 8, బెంగాల్ నుంచి 3, జమ్మూ నుంచి 1 మరియు కాశ్మీర్ , మణిపూర్, త్రిపుర లో ఒక్క స్థానంలో పోటీ జరుగుతోంది. ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించగా, కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న 88 స్థానాల్లో బీజేపీ 52, కాంగ్రెస్ 18 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంలో ఇతర పార్టీలకు 18 సీట్లు రాగా, అందులో 7 సీట్లు బీజేపీ మిత్రపక్షాలకు, 11 సీట్లు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు మిత్రపక్షాలకు దక్కాయి. ఈసారి మారిన రాజకీయ సమీకరణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చే రెండో దశలో అందరి చూపు ఆ సీట్లపైనే ఉంది. ఎవరు ఎన్ని స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తారు ? 2024 లోక్సభ ఎన్నికల రెండో దశలో 88 స్థానాల్లో అభ్యర్థులను పరిశీలిస్తే.. బీజేపీ 69 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోగా, కాంగ్రెస్ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్డీయే మిత్రపక్షమైన ఏక్నాథ్ షిండే వర్గం శివసేన 3 స్థానాల్లో పోటీ చేయగా, జేడీయూ 4 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో పాటు ఆర్ఎస్పీఎస్ 1 స్థానంలో, జేడీఎస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి RJD 2, SP 4, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 స్థానాల్లో అభ్యర్థులను, RCP 1, KCM 1, NCP 1, ఉద్ధవ్ థాకరే, శివసేన 4 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. రెండో దశలో ఈ 54 సీట్లు 2024లో ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చనున్నాయి. అందరి చూపు ఈ 54 సీట్లపైనే ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 72 స్థానాల్లో 56 స్థానాల్లో 40 శాతానికి పైగా ఓట్లు రాగా, కాంగ్రెస్కు 26 స్థానాల్లో 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది కాకుండా 23 స్థానాల్లో 30 నుంచి 40 శాతం ఓట్ల శాతం నమోదైంది. ఈ విధంగా బీజేపీ భారీ మెజార్టీతో సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో విజయ మార్జిన్ రెండు శాతం కంటే తక్కువ ఉన్న ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ – కాంగ్రెస్కు ఎన్ని సీట్లు సేఫ్ ? రెండో విడత లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల బలమైన స్థానాలతో పాటు పలు ఊపుఉన్న సీట్లు కూడా ఉన్నాయి. 2009 నుండి, ప్రస్తుత ఎన్నికల్లో 88 సీట్లలో 14 స్థానాలు నిలబెట్టుకోలేదు. ఈ సీట్లు- అమ్రోహా, బలుర్ఘాట్, బంకా, భాగల్పూర్, చాలకుడి, చిత్రదుర్గ, హింగోలి, ఇడుక్కి, కన్నూర్, కరీంగంజ్, కతిహార్, రాయ్గంజ్, సిల్చార్, త్రిస్సూర్. 2024 ఎన్నికల్లో ఈ సీట్లపైనే అంతా ఆధారపడి ఉంది. దీంతో పాటు ఈసారి మారిన రాజకీయ సమీకరణాల్లో యూపీ, బీహార్, మహారాష్ట్రల్లో సీట్ల ఆట మారినట్లు కనిపిస్తోంది. రెండవ దశలో 19 స్థానాలు బీజేపీకి సురక్షితమైనవిగా పరిగణించారు. ఎందుకంటే 2009 నుండి జరిగిన మూడు ఎన్నికలలో పార్టీ ఈ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో 2009 తర్వాత ఈ స్థానాలు రెండుసార్లు గెలిచినందున 24 లోక్సభ స్థానాలు అసురక్షితంగా పరిగణించారు. గత మూడు ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే గెలిచినందున ఆరు స్థానాలు బీజేపీకి బలహీనంగా పరిగణిస్తారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో సురక్షితంగా ఉండగా, సాపేక్షంగా 11 స్థానాల్లో సురక్షితంగా ఉంది. కాంగ్రెస్ 22 స్థానాల్లో బలహీనంగా ఉండగా, 28 స్థానాల్లో చాలా బలహీనంగా ఉంది. ఏదైనా అసురక్షిత, బలహీనమైన సీట్లపై రాజకీయ గేమ్ కావచ్చు. ఈసారి ఓటింగ్ జరుగుతున్న బీహార్లోని ఐదు స్థానాలపై కేసు నమోదైంది. నాలుగు సీట్లను కాపాడుకునేందుకు జేడీయూ సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కిషన్గంజ్, పూర్నియా స్థానాల్లో ముక్కోణపు పోటీ ఉండగా, బంకా, భాగల్పూర్, కతిహార్లో భారత్ కూటమి, ఎన్డీఏల మధ్య పోటీ నెలకొంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని 8-8 లోక్సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 8 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 7 సీట్లు గెలుచుకోగా, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. మహారాష్ట్రలో ఈసారి సమీకరణాలన్నీ మారిపోయాయి. ఎన్డీయే ఈసారి గట్టి సవాలును ఎదుర్కొంటోంది, కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేలకు కూడా అగ్ని పరీక్షే. ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలకు గాను బీజేపీ 7, బీఎస్పీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి ఎన్నికల బరిలోకి దిగగా, బీజేపీ – ఆర్ఎల్డీ కలిసి ఉన్నాయి. ఎన్నికల రంగంలో బీఎస్పీ ఒంటరిగానే ఉంది. దీన్ని బట్టి చాలా స్థానాల్లో ముక్కోణపు పోరు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బీఎస్పీ కొన్ని స్థానాల్లో ఎన్డీయేకు టెన్షన్ను సృష్టిస్తోంది. అయితే భారత్ కొన్ని చోట్ల పొత్తుల ఆటను చెడగొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు యూపీలోని 8 సీట్లపైనే ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ క్లీన్స్వీప్.. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్లో 14 సీట్లు, ఛత్తీస్గఢ్లో 3 సీట్లు ఉండగా, వాటిపై బీజేపీ విజయం సాధించింది. అలాగే త్రిపుర, జమ్మూ-కశ్మీర్, మణిపూర్లలో కూడా బీజేపీ ఒక్కో సీటు గెలుచుకుంది. రాజస్థాన్లో బీజేపీకి ఈసారి రాజకీయ మార్గం అంత సులభం కాదు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది ఛత్తీస్గఢ్లో అధికార మార్పిడి తర్వాత బీజేపీకి ఇది అగ్ని పరీక్షే. అలాగే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి 20 స్థానాలకు 19 స్థానాలను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాలు కేరళ నుంచి కాంగ్రెస్కు దక్కగా, ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లతో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తి బలంతో ఎన్నికల రంగంలో ఉంది. కేరళలో బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ నానాటికీ పెరుగుతోంది. దీంతో పలు స్థానాల్లో ముక్కోణపు పోరు సాగుతోంది. ఈ విధంగా కేరళలో సీట్లు నిలుపుకోవడం కాంగ్రెస్కు సవాల్గా మారగా, యూపీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఖాతా తెరవడమే సవాల్.
- రాజమౌళిని రాఘవేంద్రరావు అంత టార్చర్ చేశాడా?.. దర్శకేంద్రుడితో బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని బయటపెట్టిన జక్కన్నon April 27, 2024 at 3:23 am
దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్రరావు మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే రాఘవేంద్రరావు విషయంలో రాజమౌళికి ఓ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉందట. తాజాగా అది బయటపెట్టాడు జక్కన్న. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి ఎవరికి వారు దర్శక దిగ్గజాలు. ఒకప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలు ఇప్పుడు వస్తే, ఏ పాన్ ఇండియా సరిపోదు, గ్లోబల్ ఫిల్మ్ లుగా ఆదరణ పొందేవి. వందల కోట్ల కలెక్షన్లని రాబట్టేవి. కానీ రాజమౌళి ఇప్పుడు అలాంటి అద్భుతాలు చేసి ఇండియన్ సినిమా రేంజ్ని పెంచాడు, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. మన భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. రాఘవేంద్రరావుకి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీల మధ్య అనుబంధం, రిలేషన్ ఉంది. రాఘవేంద్రరావు వద్ద రాజమౌళి పనిచేశారు కూడా. యాడ్స్ చేశారు. టీవీ సీరియల్ కూడా డైరెక్ట్ చేశారు. రాజమౌళి వర్క్ నేర్చుకుందంటే రాఘవేంద్రరావు వద్దే అని చెప్పొచ్చు. అయితే ఆ సమయంలో ఓ సందర్భంలో రాఘవేంద్రరావు.. రాజమౌళిని టార్చర్ చేశారట. ఈ విషయాన్ని జక్కన్నే వెల్లడించారు. ఆ రోజుకు తనకు పెద్ద టార్చర్ అని చెప్పాడు. ఆయన కారులో కూర్చోవాలంటే భయమేసిందట. భయపడుతూనే కూర్చున్నాడట. ఆ సమయంలో చుక్కలు కనిపించాయని తెలిపారు రాజమౌళి. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. ఓ రోజు రాఘవేంద్రరావు ఇంటికి వెళ్తే ఆయన వైట్ కారు, నిగనిగ మెరుస్తుందట. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ నీట్గా టర్కీ టవల్ వేసి ఉంటుందట, అది ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత వైట్గా ఉంటుందట. ఆ రోజు బయటకు వెళ్లాల్సి వచ్చింది. రా రాజమౌళి అని తనని పిలిచాడట రాఘవేంద్రరావు. డ్రైవర్ లేకపోవడంతో తనే డ్రైవ్ చేస్తున్నాడు. తాను ఎక్కడ కూర్చోవాలనేది పెద్ద ప్రశ్న. తాను డర్టీగా ఉన్నాడట. ఫ్రంట్ సీట్లో కూర్చొంటే ఆ టవల్ మాసిపోతుందేమో అని బయపడ్డాడట. వెనకాల కూర్చుంటే రాఘవేంద్రావు డ్రైవ్ చేస్తుంటే తాను వెనకాల కూర్చుంటే బాగోదు అనిపించిందట. ఎట్టకేలకు ముందు సీట్లోనే కూర్చున్నాడట. కానీ సీట్ ఎడ్జ్లో కూర్చుని కూర్చోనట్టుగా భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడట. ఆ జర్నీ అయిపోయేంత వరకు చుక్కలు కనిపించాయని, అదొక పెద్ద నరకం అని బాంబ్ పేల్చాడు రాజమౌళి. రాఘవేంద్రరావు జర్నీని తెలియజేసేలా `సౌందర్యలహరి` టాక్ ని రన్ చేసిన విషయం తెలిసిందే. దీనికి రాజమౌళి, ప్రభాస్ గెస్ట్ లుగా వచ్చారు. ఆసమయంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు జక్కన్న. రాఘవేంద్రరావు ముందే ఈ విషయాన్ని చెప్పడం విశేషం. అయితే దీన్ని అందరు ఫన్నీగా తీసుకున్నారు. నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, ఎన్టీఆర్ సినిమాలు సంబంధించిన సీన్లపై చర్చించారు. `బాహుబలి` సమయంలో ఈ చర్చ నడిచింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో `ఎస్ఎస్ఎంబీ29` చిత్రంపై బిజీగా ఉన్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుందని తెలుస్తుంది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. మరోవైపు రాఘవేంద్రరావు దర్శకుడిగా సినిమాలు మానేసి టీవీ సీరియల్స్, ఓటీటీ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు.
- ప్రియమణితో హైపర్ ఆది ఎఫైర్..? అసలు మ్యాటర్ బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్.. నిజంగా ఆశ్చర్యమే!on April 27, 2024 at 2:13 am
హీరోయిన్ ప్రియమణి, కమెడియన్ హైపర్ ఆది మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో ఏదో ఉందనే రూమర్లు వచ్చాయి. తాజాగా దీనిపై ఆది స్పందించారు. అసలు విషయం చెప్పాడు. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంటుంది. విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తుంది. ఆమె ఇల్లాలుగా, పవర్ ఫుల్ ఉమెన్ పాత్రలు, యాక్షన్ తరహా పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది. హీరోయిన్గా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు హుందాగా కనిపిస్తూ అదరగొడుతుంది. వెబ్ సిరీస్లో, ఓటీటీ ఫిల్మ్ లు, సినిమాలు ఇలా అన్ని రకాలు ప్రాజెక్ట్ లు చేస్తూ రాణిస్తుంది. ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల `మైదాన్`లో మెరిసింది. దీంతోపాటు `భామ కలాపం 2`తోనూ వచ్చింది. ప్రియమణి `ఢీ`షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. లాస్ట్ సీజన్ వరకు ఆమె జడ్జ్ గా ఉన్నారు. తనదైన జడ్జ్ మెంట్తో ఆకట్టుకుంది. డాన్సులతో అదరగొట్టింది. జోవియల్గా ఉంటూ అలరించింది. హైపర్ ఆదితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. `ఢీ` షోలో డాన్సర్ల పర్ఫెర్మెన్స్ మధ్యలో హైపర్ ఆది సమక్షంలో చిన్న చిన్నస్కిట్లు ప్రదర్శిస్తుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. `ఢీ`షోకి ఈ కాన్సెప్ట్ కొత్త జోష్ని నింపుతుంది. దీంతోపాటు గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. సీరియస్గానే వెళ్లకుండా ఇలా ఫన్ గా షోని నడిపిస్తుండటంలో మంచి రేటింగ్తో రన్ అవుతుంది. అన్ని రకాలుగా ఇది ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే హైపర్ ఆదితో కలిసి ప్రియమణి చేసే ఫన్ హైలైట్గా నిలిచేది. ఆదిని బావ బావ అంటుంది ప్రియమణి. వయసులో ఆమెనే పెద్ద అయినా, తాను కాస్త తగ్గి అలా ఫన్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆది కూడా చాలా చనువుగా ఉండేవారు, ఓ సందర్భంలో ఆది ల్యాప్పై కూర్చుంది ప్రియమణి. అది అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. చూడబోతుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ప్రియమణి, హైపర్ ఆది మధ్య ఏం నడుస్తుందని ఆరా తీసే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హైపర్ ఆది స్పందించారు. ప్రియమణితో తమకు ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాడు. `ట్యాగ్ తెలుగు` టాక్ షోలో పాల్గొన్న ఆదికి ఈ ప్రశ్న ఎదురుకాగా, ఆయన ఓపెన్ అయ్యాడు. అసలు విషయం బయటపెట్టాడు. తమ మధ్య ఏం లేదని తేల్చేశాడు. ప్రియమణి ఓ జాతీయ అవార్డు గ్రహీత, సెట్లో ఎంత క్లోజ్గా, ఎంత స్పోర్టీవ్గా ఉంటారంటే, నన్ను బావ బావ అని పిలుస్తారు. ఎప్పుడు ఏం చేసినా అంతే స్పోర్టీవ్గా తీసుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసి పోతారు. డాన్సర్లతో కలిసి రీల్స్ చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఆమె ఓ స్టేజ్ని చూసి వచ్చారు. స్టార్ ఇమేజ్ని అనుభవించి వచ్చారు. అనుభవిస్తున్నారు. కానీ చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్` అని తెలిపారు ఆది. హైపర్ ఆది ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`, ఢీ షోలు చేస్తున్నారు. `జబర్దస్త్` మానేసి విషయం తెలిసిందే. దీంతో ఆ లోటు జబర్దస్త్ లో కనిపిస్తుంది. ఇప్పుడు రెండు షోలతోపాటు సినిమాలు చేస్తున్నారు ఆది. మరోవైపు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన బిజీగా ఉన్నాడు.
- `కల్కి2898ఏడీ` కొత్త రిలీజ్ డేట్ ఇదే?.. కరెక్ట్ గా రెండు నెలలు.. ఫ్యాన్స్ కి ఊరటon April 27, 2024 at 1:17 am
ప్రభాస్ నటిస్తున్న `కల్కి2898ఏడీ` చిత్రం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియన్ సినీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు గ్లోబల్ ఫ్యాన్స్ ని కూడా వెయిట్ చేయిస్తున్న మూవీ `కల్కి2898ఏడీ`. దర్శకుడు అశ్విన్ ఈ మూవీలో ఏంచూపించబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. సైన్స్ కి, మైథలాజికల్ అంశాలకు ఎలా ముడిపెట్టాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్లలో మాత్రం కంటెంట్ పరంగా ఎలాంటి క్లూ లేదు. జస్ట్ పాత్రలను, కొన్ని సీన్లని మాత్రమే చూపించారు. కానీ సినిమా ఏంటనేది అర్థం కాలేదు. అదే సమయంలో అవి కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. కానీ ఏదో క్యూరియాసిటీ, నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. నాగ్.. కంటెంట్ ఉన్నోడు, అంత ఆశామాషీ కాదని అందరికి తెలుసు. అదే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుతుంది. అయితే రిలీజ్ డేట్కి సంబంధించి సస్పెన్స్ చాలా కాలంగా కొనసాగుతుంది. మే 9న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందని అన్నారు. ఎన్నికలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ టీమ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అప్ డేట్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఈ రోజు(ఏప్రిల్ 27) సాయంత్రం ఐదు గంటలకు అప్ డేట్రాబోతుందని, ఇక వెళ్లడించే టైమ్ వచ్చిందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మరి సినిమా కొత్త డేట్ ఎప్పుడనేది పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే చిత్ర వర్గాల నుంచి, టాలీవుడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు `కల్కి 2898 ఏడీ` కొత్త డేట్ ఫైనల్ అయ్యిందట. సాయంత్రం ఆ డేట్ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్ 27న రాబోతుందని, టీమ్ ఆ డేట్ని టాక్ చేసిందని సమాచారం. అయితే మొన్నటి వరకు మే 30 లేదంటే జూన్ మొదటి వారంలో వస్తుందని భావించారు. కానీ జూన్ చివరికి వెళ్లిపోయిందని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి టీమ్ ఇదే డేట్కి ఫిక్స్ అయి ఉంటుందా? లేదా మారుస్తుందా అనేది సాయంత్రం ఓ క్లారిటీ వస్తుంది. ఇదే నిజమైతే ఇక `కల్కి2898ఏడీ` రిలీజ్కి కరెక్ట్ గా రెండు నెలలు ఉంది. సరిగ్గా ఆరవై రోజుల్లో ఈ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. కానీ ఇది మరీ లాంగ్ డిలే అని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు ఫస్టాఫ్లోనే వస్తుందని, మరీ సెకండాఫ్కి వెళ్లకుండా ముందుగానే వస్తుందనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ దాదాపు నాలుగేళ్లుగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీతోపాటు యంగ్ హీరోలు ముగ్గురు గెస్ట్ రోల్ చేస్తున్నారు, ఇద్దరు హీరోయిన్లు మెరుస్తారని సమాచారం. అశ్వినీదత్ ఈ మూవీని సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
- Today Panchangam:నేడు దుర్ముహుర్తం ఎప్పుడు ఉందో తెలుసా?on April 26, 2024 at 11:40 pm
తెలుగు పంచాంగం ప్రకారం.. 27 ఏప్రిల్ 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 27 ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం శనివారం తిథి :- తదియ ఉ॥06:41ని॥ వరకు తదుపరి చవితి నక్షత్రం :- జ్యేష్ట రాత్రి 02:47ని॥ వరకు యోగం:- పరిఘ రాత్రి02:00ని॥ వరకు కరణం:- భద్ర ఉ॥06:41బవ సా॥06:33ని॥ వరకు వర్జ్యం:- ఉ॥ 07:59ని॥ల09:37ని॥ వరకు అమృత ఘడియలు:- సా॥05:47ని॥ల07:25ని॥వరకు దుర్ముహూర్తం:- ఉ.05:40 ని॥ల 7:20ని॥వరకు రాహుకాలం:- ఉ9:00 ని॥ల 10:30 ని॥వరకు యమగండం:- మ.01:30 ని॥ల 3:00 ని॥వరకు సూర్యోదయం :- 5:41 ని॥ లకు సూర్యాస్తమయం:- 6:13 ని॥ లకు
- Today Horoscope: ఓ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి..!on April 26, 2024 at 11:30 pm
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది…ఎవరికి ఇబ్బందులు ఉంటాయి …ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు. భరణి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు. కృత్తిక నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. దిన ఫలం:-చేయి పనులు అనుకూలం గా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు.ఆవేశపూరిత నిర్ణయానికి పట్టుదలకు దూరంగా ఉండాలి.ఆర్థికపరంగా లాభము కలుగును. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2) నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో) తారాధిపతి రోహిణి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. మృగశిర నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందగలరు. ప్రయాణాలు అనుకూలించును.చేసే పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలం.కుటుంబ సౌఖ్యం లభించును.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం పొందుతారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తో సత్సంబంధాలు మెరుగుపడతాయి.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3) నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి) తారాధిపతి ఆరుద్ర నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది. పునర్వసు నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును. దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి.వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తి అగును.శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష ) నామ నక్షత్రాలు హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాధిపతి పుష్యమి నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. ఆశ్రేష నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ. దిన ఫలం:-ఆదాయం మార్గాలు అన్వేషణ చేస్తారు.ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తి యొక్క సహాయ సహకారం లభిస్తుంది.ప్రతి చిన్న విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. రావలసిన బాకీలు వసూలు అవును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి. సింహం (మఖ , పుబ్బ, ఉత్తర 1) నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే తారాధిపతి మఘ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు . పూ.ఫల్గుణి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు. ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. దిన ఫలం:-తల పట్టిన పనులు ఆలస్యంగా జరుగును.మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును.వ్యాపారంలో ధన నష్టము.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.గృహోపకరణాలు నిమిత్తం ఖర్చు చేస్తారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.ఆర్థిక సమస్యలు రాగలవు.ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులు తో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2) నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో) తారాధిపతి హస్త నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. చిత్త నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. దిన ఫలం:-చేయు పనులు లో శారీరక శ్రమ పెరుగుతుంది.మానసికంగా భయాందోళన ఉంటుంది. కుటుంబ సమస్యలు రావచ్చు.వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులు యొక్క ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా వుండును.పనులలో ఆటంకాలు ఏర్పడగలవు.కుటుంబ వ్యవహారాలు చిరాకుగా ఉంటుంది.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3) నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే) తారాధిపతి స్వాతి నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది. విశాఖ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును. దిన ఫలం:-ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు పొందుతారు.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు చేకూరుతాయి.ఆరోగ్యం అనుకూలించును.అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.కుటుంబం లో ఆనందకరమైన వాతావరణం.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు.ధనాదాయ విషయంలో లోటు ఉండదు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. వృశ్చికము (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ ) నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు) తారాధిపతి అనూరాధ నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ. దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.కుటుంబ వ్యవహారాలు లో భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు రాగలవు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేసే పనుల్లో అసహనం నిరుత్సాహం ఏర్పడును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. ధనుస్సు (మూల ,పూ.షాఢ , ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) తారాధిపతి మూల నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు . పూ.షాఢ నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు. ఉ.షాఢ నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి . దిన ఫలం:-శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.గొడవలు కు వాగ్వి వివాదాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు రాగలవు.చేసే పని యందు ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2) నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ) తారాధిపతి శ్రవణా నక్షత్రం వారికి సాధన (సాధన తారాధిపతి చంద్రుడు) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. ధనిష్ఠ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దిన ఫలం:-కుటుంబము లో చికాకులు గా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆర్థిక విషయాలు ఇబ్బందికరంగా ఉండును.గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరకంగా మానసికంగా బలహీన ముగా నుండును.ఓం నమః శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి. కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3) నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) తారాధిపతి శతభిషం నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది. పూ.భాద్ర నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉండును. దిన ఫలం:-మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.గృహ సంబంధ విషయాలు అనుకూల వాతావరణం.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉన్నతాధికారుల నుంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి ) నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి) తారాధిపతి ఉ.భాద్ర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ . దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల నుంచి గౌరవం లభిస్తుంది.తలచిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.చేయు వ్యవహారాలు సజావుగా సాగుతాయి.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహంలో సుఖశాంతులు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం ధన్య లక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
- KKR vs PBKS : మరోసారి దుమ్మురేపిన సునీల్ నరైన్.. విరాట్ కోహ్లీ తర్వాత ఇతనే..on April 26, 2024 at 7:59 pm
IPL 2024 – Sunil Narine : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. దీంతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రెండో స్థానానికి చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్ కు ముందు నరైన్ టాప్ 10లో కూడా లేడు. కానీ పంజాబ్ తో జరిగిన ఇన్నింగ్స్ ఆరెంజ్ క్యాప్ పరిస్థితులను మార్చేసింది. నరైన్ ఈ సీజన్ లో 8 ఇన్నింగ్స్ లలో 44.62 సగటుతో 357 పరుగులు చేశాడు. నరైన్ సగటు కూడా 184.02గా ఉంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 9 మ్యాచ్ లలో 430 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 145.76 గా ఉండగా, 61.43 సగటుతో పరుగుల వరద పారించాడు. 2011 తర్వాత ఐపీఎల్ లో కోహ్లీ 400 పరుగులు చేయడం ఇది పదోసారి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 349 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ సగటు 58.17గా ఉంది. అతని స్ట్రైక్ రేటు కూడా 142.45 గా ఉంది. నరైన్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (342) నాలుగో స్థానానికి పడిపోయాడు. పంత్ 9 మ్యాచ్ లలో 48.86 సగటుతో 161.32 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఐదో స్థానంలో నిలిచాడు. 9 మ్యాచుల్లో 334 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 128.96, సగటు 37.11గా ఉంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగుకే ఔటైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఏడు మ్యాచుల్లో 325 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ 8 మ్యాచ్ లలో 318 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 9వ స్థానానికి పడిపోయాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్ లలో 314 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 152.43, సగటు 62.80గా ఉంది. శివమ్ దూబే (311), శుభ్ మన్ గిల్ (304) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. KKR VS PBKS : బెయిర్స్టో సూపర్ సెంచరీ.. కోల్కతా పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డు Majje hi majje! 🔥#SaddaPunjab #PunjabKings #JazbaHaiPunjabi #TATAIPL2024 #KKRvPBKS pic.twitter.com/mjOK8EEEez — Punjab Kings (@PunjabKingsIPL) April 26, 2024 KKR vs PBKS : కోల్ కతా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్
- KKR vs PBKS : బెయిర్స్టో సూపర్ సెంచరీ.. కోల్కతా పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డుon April 26, 2024 at 7:22 pm
KKR vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024 42వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. కేకేఆర్ సాధించిన భారీ పరుగులను పంజాబ్కు చెందిన జానీ బెయిర్స్టో, శశాంక్ సింగ్ తుఫాను బ్యాటింగ్ తో టీ20 క్రికెట్ లో అతిపెద్ద పరుగును ఛేదించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (71 పరుగులు), ఫిలిప్ సాల్ట్ (75 పరుగులు) హాఫ్ సెంచరీలతో 20 ఓవర్లలో 261/6 స్కోరు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ సూపర్ ఇన్నింగ్స్ ను ఆడారు. జానీ బెయిర్స్టో అజేయంగా 108 పరుగులతో సెంచరీ సాధించాడు. శశాంక్ సింగ్ అజేయంగా 68 పరుగులతో కేకేఆర్ నుంచి మ్యాచ్ ను పంజాబ్ కు తీసుకువచ్చాడు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే 262 పరుగులతో భారీ టార్గెట్ ను అందుకుంది. టీ20 క్రికెట్ లో చారిత్రాత్మక విజయం అందుకుంది. బెయిర్స్టో-శశాంక్ తుఫానీ ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు శుభారంభం అందించి తొలి వికెట్కు 93 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం జానీ బెయిర్స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్ మధ్య జరిగింది. 20 బంతుల్లో 54 పరుగులు చేసి ప్రభ్సిమ్రాన్ సింగ్ అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ప్రభ్ సిమ్రన్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రిలీ రూసో 26 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత జట్టులో ఎటువంటి వికెట్ పడలేదు. శశాంక్ సింగ్ బెయిర్స్టోతో కలిసి పంజాబ్ను చారిత్రాత్మకంగా విజయం వైపు నడిపించాడు. బెయిర్స్టో బ్యాట్తో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. అదే సమయంలో శశాంక్ 28 బంతుల్లో 68 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. For his phenomenal show with the bat in a record chase, Jonny Bairstow bags the Player of the Match Award 🏆 Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/G3HVTUmOJF — IndianPremierLeague (@IPL) April 26, 2024 కేకేఆర్ బౌలింగ్ ను చిత్తుచేశారు.. ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లు దారుణంగా దెబ్బతిన్నారు. ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్ లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో ఇద్దరు బౌలర్లు 2-2 ఓవర్లు బౌలింగ్ చేసి 36-36 పరుగులు ఇచ్చారు. దుష్మంత చమీర 3 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే వికెట్ తీశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. రమణదీప్ సింగ్ 4 బంతుల్లో 9 పరుగులు ఇచ్చాడు. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ సూపర్ ఇన్నింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్కు 262 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ లు చెలరేగి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్స్లు), సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్స్లు)తో రాణించారు. వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశారు. 5 పరుగుల వద్ద రింకూ సింగ్ ఔటయ్యాడు. రమణదీప్ సింగ్ 3 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్లకు తలో వికెట్ దక్కింది. KKR VS PBKS : కోల్ కతా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్
- KKR vs PBKS : కోల్ కతా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్on April 26, 2024 at 6:26 pm
KKR vs PBKS : ఐపీఎల్ 2024 42వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. కేకేఆర్ తొలుత బ్యాటింగ్ తో తుఫాను ఇన్నింగ్స్ తో దుమ్మురేపింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 261 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ బ్యాటర్లు ప్రకంపనలు సృష్టించారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 10.2 ఓవర్లలో 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ప్లేలో నరైన్-సాల్ట్ దుమ్మురేపారు.. ఈ ఐపీఎల్ సీజన్లో పవర్ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో సునీల్ నరైన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలోని టాప్-5 బ్యాట్స్మెన్లలో ఇద్దరు కేకేఆర్ ప్లేయర్లు ఉండటం విశేషం. నరైన్ 177.39 స్ట్రైక్ రేట్తో 204 పరుగులు చేశాడు. కాగా, ఫిలిప్ సాల్ట్ 175.45 స్ట్రైక్ రేట్తో 193 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 229.20 స్ట్రైక్ రేట్తో 259 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 155.39 స్ట్రైక్ రేట్తో 216 పరుగులు చేశాడు. 7 సంవత్సరాల తర్వాత.. 7 ఏళ్ల తర్వాత కోల్కతాకు ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో కోల్కతాకు ఇది ఎనిమిదో సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా 2017 తర్వాత ఇదే తొలిసారి. సునీల్ నరైన్, క్రిస్ లిన్ చివరిసారిగా 2017లో బెంగళూరులో ఆర్సీబీపై 105 పరుగులు జోడించారు. ఐపీఎల్ లో కేకేఆర్ నుంచి అత్యధిక భాగస్వామ్యం.. 184* – గౌతమ్ గంభీర్ – క్రిస్ లిన్ vs గుజరాత్ లయన్స్, రాజ్కోట్, 2017 158 – గౌతమ్ గంభీర్ – రాబిన్ ఉతప్ప vs రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణె, 2017 152* – గౌతమ్ గంభీర్ – జాక్వెస్ కల్లిస్ vs రాజస్థాన్ రాయల్స్, 1 జైపూర్, 138 – సునీల్ నరైన్ – ఫిల్ సాల్ట్ vs పంజాబ్ కింగ్స్, కోల్కతా, 2024 136 – మన్విందర్ బిస్లా-జాక్వెస్ కల్లిస్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై, 2012 ఫైనల్ పఠాన్ను అధిగమించిన నరేన్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్ తన సిక్సర్ల సంఖ్యను 88 పెంచుకున్నాడు. దీంతో జట్టు తరఫున ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రస్సెల్ ఖాతాలో 201 సిక్సర్లు ఉన్నాయి. నితీష్ రాణా 106 సిక్సర్లు, సునీల్ నరైన్ 88, యూసుఫ్ పఠాన్ 85, రాబిన్ ఉతప్ప 85 సిక్సర్లు కొట్టారు. Batting ✅ Bowling ✅ Fielding✅ Sunil Narine. GOAT for a reason. pic.twitter.com/5IDznndx0Z — KolkataKnightRiders (@KKRiders) April 26, 2024 KKR VS PBKS : సునీల్ నరైన్ విధ్వంసం.. దుమ్మురేపిన ఫిల్ సాల్ట్..
- KKR vs PBKS : సునీల్ నరైన్ విధ్వంసం.. దుమ్మురేపిన ఫిల్ సాల్ట్..on April 26, 2024 at 5:32 pm
KKR vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తూ పరుగుల వరద పారుతోంది. మరోసారి కేకేఆర్ బ్యాటర్లు రాణించడంతో 250+ భారీ స్కోర్ ను సాధించింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో జానీ బెయిర్స్టో తిరిగి వచ్చాడు. అలాగే, రూ.24.75 కోట్ల విలువైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్కతా తప్పించింది. అతని స్థానంలో దుష్మంత చమీరకు అవకాశం దక్కింది. కేకేఆర్ ఓపెనర్ల పరుగుల సునామీ.. పవర్ప్లేలో కోల్కతా నైట్ రైడర్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 15 బంతుల్లో 38 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు తలో 2 సిక్సర్లు బాదారు. పంజాబ్ ఆటగాళ్లు వీరిద్దరికీ ఒక్కో లైఫ్ ఇచ్చారు. మూడో ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ క్యాచ్ మిస్సయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన బంతిని హర్ ప్రీత్ బ్రార్ క్యాచ్ పట్టలేకపోయాడు. అదే సమయంలో, ఆరో ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ సామ్ కర్రాన్ తన క్యాచ్ను వదిలేశాడు. అర్ష్దీప్ సింగ్ బంతికి ఫిలిప్ సాల్ట్ క్యాచ్ పట్టలేకపోయాడు. దీంతో ఇద్దరు ప్లేయర్లు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. అందుకు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ జోరుగా ఇన్నింగ్స్ ఆడారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు. వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశారు. 5 పరుగుల వద్ద రింకూ సింగ్ ఔటయ్యాడు. రమణదీప్ సింగ్ 3 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అర్ష్దీప్ సింగ్ అత్యధికంగా 2 వికెట్లు తీశాడు. శామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. సునీల్ నరైన్ మరోసారి దుమ్మురేపాడు. 71 పరుగుల తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఫిల్ సాల్ట్ 75 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. 𝐁𝐥𝐨𝐜𝐤𝐛𝐮𝐬𝐭𝐞𝐫 at the box office 📽️ pic.twitter.com/pom9hJZq5X — KolkataKnightRiders (@KKRiders) April 26, 2024 17 ఏళ్ల వయస్సులో అంజలి ప్రేమలో.. మారువేషంలో డేట్.. సచిన్ టెండూల్కర్ ‘లవ్ స్టోరీ’..
- ఆ స్టార్ సింగర్ అంటే సురేఖవాణి కూతురుకి అంత పిచ్చా?.. సింగిలైతే తానురెడీ అంటూ సుప్రీత బోల్డ్ స్టేట్మెంట్on April 26, 2024 at 5:17 pm
సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. బోల్డ్ గా హల్చల్ చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు స్టార్ సింగర్లపై తన క్రష్ని బయటపెట్టింది. సీనియర్ నటి సురేఖవాణి ఒకప్పుడు కామెడీ ఆర్టిస్ట్ గా మెప్పించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా రాణించారు. కానీ ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతుంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఫోటో షూట్లు, ఎంజాయ్మెంట్లు, ఫారెన్ టూర్లతో హంగామా చేస్తుంది. తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ రచ్చ చేస్తుంది. ఇక కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. బోల్డ్ గా రచ్చ చేస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి గాలెం వేస్తూ అలరిస్తుంది. పొట్టిదుస్తుల్లో కనిపిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వదు. ఇక తల్లీకూతుళ్లు చేసే యాక్టివిటీస్ చాలా వరకు ట్రోల్స్ కి కారణమవుతుంటుంది. ఇదిలా ఉంటే సుప్రీత హీరోయిన్గా మారింది. ఆమె హీరోయిన్గా నటిస్తున్న మూవీ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ మూవీ ఉంది. ప్రస్తుతం సుప్రీత ఈ మూవీలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే సుప్రీత.. లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె స్టార్ సింగర్పై తన క్రష్ని బయటపెట్టింది. ఆయనంటే ఇష్టమని, సింగిల్ అయితే తనకు ఓకే అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని యాంకర్ రీతూ చౌదరి వెల్లడించడం విశేషం. తాజాగా ఇది రచ్చ రచ్చ అవుతుంది. రీతూ చౌదరి యాంకర్ గా `దావత్` అనే టాక్ షో రన్ అవుతుంది. సెలబ్రిటీలు ఇందులో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్లో సింగర్ శ్రీరామ చంద్ర పాల్గొన్నారు. ఓ వైపు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతలో యాంకర్ రీతూ చౌదరి.. ఆయనపై ఇద్దరు భామలు క్రష్ పెంచుకున్నారని తెలిపింది. మీపై ఇద్దరు అమ్మాయిలు క్రష్ పెంచుకున్నారని, ఇష్టపడుతున్నారని రీతూచౌదరి తెలిపింది. ఎవరు అని అడగ్గా, కుషిత అని చెప్పింది. ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని, ఆయన మొగుడిలా అనిపిస్తాడు. మొగుడైతే బాగుండూ అని చెప్పినట్టు రీతూ చౌదరి తెలిపింది. దీంతో షోలో ఆడియెన్స్ కేకలు వేయగా, శ్రీరామ చంద్ర మీసాలు తిప్పుతూ రెచ్చిపోయాడు. ఇక మరో అమ్మాయి గురించి చెబుతూ, ఆమె సుప్రీత అని వెల్లడించింది. ఎవరు నీ క్రష్ అంటే.. శ్రీరామ చంద్ర నా క్రష్ అని చెప్పిందట. అంతేకాదు దావత్ షోకి వస్తున్నాడని ఆమెతో చెబితే.. ఏ అడుగు నేను సింగిలే, ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందట సుప్రీత. దీనికి నవ్వులు పూయించిన శ్రీరామ చంద్ర, తాను సింగిలే అని, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ క్లిప్ యూట్యూబ్లో వైరల్ అవుతుంది.
- అల్లు అర్హ మా వసపిట్ట.. అల్లు అర్జున్ కూతురుపై నిహారికా కామెంట్.. ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పిన మెగాడాటర్on April 26, 2024 at 3:36 pm
అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అర్హ ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పింది నిహారిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కూతురు అల్లు అర్హ చాలా యాక్టివ్ అనే విషయం తెలిసిందే. ఆమెకి సంబంధించిన ఫన్నీ వీడియోలను బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. అభిమానులతో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు బన్నీ. అల్లు అర్హ ఇంట్లో అల్లరి మామూలుగా ఉండదట. బన్నీ కొడుకు అల్లు అయాన్ కాస్త సైలెంట్. కూల్గా ఉంటాడు. కానీ అర్హ మాత్రం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని, నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుందట. బన్నీ కూడా పలు సందర్భాల్లో తెలిపారు. ఇంట్లో అర్హ ఉందంటే సందడే సందడి అని అంటుంటారు. తాజాగా నిహారిక అర్హ గురించి చెప్పింది. బన్నీ తరహాలోనే నిహారిక చెప్పింది. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. అర్హ తమ వస పిట్ట అని, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని చెప్పింది. చాలా క్యూట్గా ఉంటుందని, మాటలు కూడా అంతే క్యూట్గా ఉంటాయని చెప్పింది మెగా డాటర్. తనని నిహా అత్త అని పిలుస్తుందట. అందరు పిల్లలు నిహా పిన్ని అని పిలిస్తే తను మాత్రం నిహా అత్తా అని పిలుస్తుందని చెప్పింది. దగ్గరకు వచ్చి ఎంతగానో మాట్లాడుతుందని, రింగులు ఎక్కడ కొన్నావ్, నన్నూ తీసుకెళ్తావా? నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుందా అంటూ క్వశ్చన్ తనదే, ఆన్సర్ కూడా తనదే అని, మనం మాట్లాడానికి ఏముండదని చెప్పింది. ఫైనల్గా చాలా మంచి పిల్ల అని చెప్పింది నిహారికా. తనతో ఉంటే చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పింది. ఫుల్ టాలెంటెడ్ అని, మంచి స్థాయికి వెళ్తుందని వెల్లడించింది మెగాడాటర్. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అర్హ గురించి చెప్పుకొచ్చింది నిహారిక. అల్లు అర్హ.. ఆల్రెడీ బాలనటిగా సినిమా ఎంట్రీ ఇచ్చింది. సమంత నటించిన `శాకుంతలం`లో బాల భరతుడి పాత్రలో నటించింది అర్హ. తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. సినిమాలకే హైలైట్గా నిలిచింది. ఇక నిహారిక యాంకర్గా కెరీర్ని ప్రారంభించి హీరోయిన్ అయ్యింది. నాలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ సక్సెస్ కాలేదు. దీంతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ని స్థాపించి వెబ్ సిరీస్లు నిర్మించింది. ఇప్పుడు `కమిటీ కుర్రాళ్లు` అనే సినిమాని నిర్మిస్తుంది. ఇక మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న నిహారిక గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా బిజీ అవుతుంది. నటిగానూ మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని సమాచారం.
- మహీంద్రాకి పోటీగా జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్.. ఫీచర్స్, ధర ఇవే..on April 26, 2024 at 2:00 pm
లెజెండరీ కంపెనీ జీప్ కొత్త రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్-రోడర్ అన్లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. పూర్తిగా డిఫరెంట్ ఎక్స్టీరియర్ అండ్ కొత్త ఫీచర్లతో ఈ కారు డెలివరీలు మే 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 2024 రాంగ్లర్ అనేది జీప్ ఆఫ్-రోడర్, సిగ్నేచర్ సెవెన్-స్లాట్ బ్లాక్-అవుట్ గ్రిల్, అప్డేట్ చేసిన ఫాసియాతో పెద్ద బంపర్ ఇంకా అన్లిమిటెడ్ & రూబికాన్ వెర్షన్ల కోసం 18-అంగుళాల అండ్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీని విండ్షీల్డ్ ఇప్పుడు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ పొందుతుంది. కొత్త కలర్ లవర్స్ కోసం రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఐదు ఎక్స్టీరియర్ షేడ్స్లో వస్తుంది. అంటే బ్రైట్ వైట్, గ్రానైట్ క్రిస్టల్, ఫైర్క్రాకర్ రెడ్, బ్లాక్ ఇంకా సర్జ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. మీకు నచ్చిన కారులో గొప్ప ఆఫ్-రోడ్ అనుభవాన్ని పొందటం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇంటీరియర్ ఫీచర్ల విషయానికొస్తే ఈ SUV ఇప్పుడు 12.5-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్-ప్లే, 12-వే పవర్ ఫ్రంట్ సీట్లు, ఆరు ఎయిర్బ్యాగ్లు, TPMS అలాగే ADAS సూట్స్ పొందుతుంది. ఈ రెండు కార్లు మే నుంచి అందుబాటులోకి రానుండగా, జీప్ రాంగ్లర్ అన్లిమిటెడ్ ధర రూ. 67.65 లక్షలు, జీప్ రాంగ్లర్ రూబికాన్ ధర రూ. 71.65 లక్షలగా ఉంటుందని అంచనా.
- ప్రభాస్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్.. డార్లింగ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడమా?.. ఆ అమ్మాయిలది బ్యాడ్ లక్!on April 26, 2024 at 1:56 pm
ప్రభాస్ రెడీ అంటే ఈ ఏజ్లోనూ ఆయనకు లవ్ ప్రపోజ్ చేయడానికి, ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి వందల ముంది అమ్మాయిలు రెడీ అంటారు. కానీ ఆయన లవ్ ప్రపోజ్ చేస్తే మాత్రం రిజెక్ట్ చేశారట. డార్లింగ్ ప్రభాస్.. తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బాలీవుడ్ లో సల్మాన్ఖాన్, తెలుగులో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ గా ఉన్నారు. వీళ్లు చాలా మంది యువకులను ఇన్స్పైర్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా చేస్తున్నారు. అయితే 45ఏళ్లు వచ్చినా ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు, దానికి వెనుకున్న కారణమేంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మ్యారేజ్ చేసుకోకపోవడానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందరిని ఆలోచింప చేస్తుంది. ఇప్పటికే సింగిల్గా ఉండటానికి అదే కారణమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదేంటంటే.. ప్రభాస్ చాలా మంది అమ్మాయిలకు లవ్ ప్రపోజ్ చేశాడట. కానీ తిరస్కారానికి గురయ్యాడట. తను `ఊ అంటేపెళ్లి చేసుకోవడానికైనా, లవ్ ప్రపోజ్ చేయడానికైనా వేల మంది క్యూలో ఉంటారు. అలాంటిది ప్రభాస్నే రిజెక్ట్ చేయడమా? కాలేజ్ టైమ్లో ప్రభాస్ చాలా మందికి లవ్ ప్రపోజ్ చేశాడట. కానీ అందరు రిజెక్ట్ చేశారని తెలిపారు. `సాహో` సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు డార్లింగ్. హీరోయిన్లతో ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అనే ప్రశ్నకి ప్రభాస్ స్పందిస్తూ, హీరోయిన్లతోనా, ఆ విషయం పెద్దగా ఆలోచించలేదని, ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపారు. ఈ సందర్భంలోనైనా ఏ అమ్మాయి అయినా రిజెక్ట్ చేసిందా అని అడగ్గా, చాలా మంది అమ్మాయిలు తనని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. కాలేజ్ డేస్లోనా అడగ్గా, నవ్వుతూ స్పందించారు. మొత్తంగా కాలేజ్ రోజుల్లోనే ప్రభాస్ చాలా మందికి ప్రపోజ్ చేసినట్టు, దీంతో రిజెక్షన్కి గురయినట్టు తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ అయ్యాక ఎవరూ రిజెక్ట్ చేసి ఉండరని అడగ్గా, అలా ఏం కాదు, ఎప్పుడైనా అది నార్మలే అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం మీరు లవ్ లో ఉన్నారా అని అడగ్గా, ప్రేమలో లేనని తెలిపారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అంతరు వెయిట్ చేస్తున్నారని అడగ్గా, ఆ విషయం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, కానీ నాక్కూడా తెలియదు అని తెలిపారు ప్రభాస్. `సాహో` సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా సరదాగా ఈ విషయాలను ప్రభాస్ పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్.. అనుష్క శెట్టితో ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభాస్గానీ, అనుష్కగానీ రియాక్ట్ కాలేదు. దీంతో ఆ పుకార్లు అలానే వినిపిస్తున్నాయి. అయితే అనుష్క, ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఒంటరిగా ఉండటం కూడా ఆశ్చర్యంగా మారింది. ఎప్పటికైనా ఈ ఇద్దరే మ్యారేజ్ చేసుకుంటారనే వార్తలకు బలాన్ని ఇస్తున్నారు. మరి అసలు ప్రభాస్ మ్యారేజ్ చేసుకుంటాడా? ఇలానే ఉండిపోతాడా అనేది పెద్ద సస్పెన్స్. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్తో `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటివాళ్లు నటిస్తున్న చిత్రమిది. జూన్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మారుతితో `ది రాజాసాబ్` చిత్రంలో నటిస్తున్నారు డార్లింగ్. ఇది చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే `సలార్ 2` ప్రారంభం కానుంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` చిత్రంలో నటించనున్నారు ప్రభాస్.